శ్రీ నారసింహ చిత్రాలయ బ్యానర్పై నరేష్ వర్మ ముద్దం దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘మర్రిచెట్టు కింద మనోళ్ళు’. ప్రమోద్ దేవా, రణధీర్, కీర్తన స్వర్గం ముస్కాన్ రాజేందర్ హీరో,హీరోయిన్లుగా నటించనున్న ఈ చిత్రం సారథి స్టూడియోలో పూజ కార్యక్రమంతో ప్రారంభమైంది. నటుడు బాబు మోహన్ నటీనటులపై క్లాప్ కొట్టారు. ఆర్టిస్టు నాగ మహేష్. కెమెరా స్విచ్చాన్ చేశారు. థర్టీ ఇయర్స్ పథ్వీ, రాజీవ్ కనకాల, తెలుగు ఫిలించాంబర్ అధ్యక్షలు దామోదర ప్రసాద్, నిర్మాత సి.కళ్యాణ్, టీఎంఏఏ ప్రెసిడెంట్ రష్మీ ఠాగుర్ చిత్ర ప్రారంభోత్సవంలో పాల్గొని, చిత్ర యూనిట్కు శుభాకాంక్షలు తెలిపారు. దర్శకుడు నరేష్ వర్మ ముద్దం మాట్లాడుతూ, ‘ప్రతి ఒక్కరిని అలరించే విధంగా ఒక మంచి సబ్జెక్టుతో చేస్తున్న చిత్రమిది. మా టైటిల్కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రారంభానికి ముందే ఈ సినిమా జనాల్లోకి వెళ్లిపోయింది. ఈ సినిమాను సపోర్టు చేసి, ఆదరించాలని అందరిని కోరుకుంటున్నాను’ అని అన్నారు. ‘యువతకు సరైన దిశా నిర్దేశం చేసే సబ్జెక్ట్ ఇది. ఇప్పటికే ఈ సినిమా పబ్లిక్లోకి వెళ్ళిపోయింది. ఇందులో మా కొడుకు ప్రమోద్ దేవా ఒక హీరోగా నటిస్తున్నాడు’ అని సహ నిర్మాత ఆకుల రిషేంద్ర నరసయ్య చెప్పారు. మరో సహ నిర్మాత బీసు చందర్ గౌడ్ మాట్లాడుతూ,’మర్రి చెట్టు తెలియని వారు ఉండరు. జీవితంలో ప్రతి ఒక్కరికి మర్రిచెట్టుతో జ్ఞాపకాలు ఉంటాయి. అలాంటి మర్రి చెట్టు కాన్సెఫ్టుతో రానున్న ఈ సినిమా అందరిని అలరించడం ఖాయం’ అని తెలిపారు.