కాలభైరవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

నవతెలంగాణ- రామారెడ్డి
మండలంలోని ఇస్సన్నా పల్లి- రామారెడ్డి లో వెలసిన శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మూలబావి నుండి మీరు తెచ్చి, ఆలయాన్ని శుభ్రపరిచి, సింధూర పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు, సందర్శకులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.