మండలంలోని ఇస్సన్న పల్లి, (రామారెడ్డి) లో వెలసిన శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో మంగళవారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు తీర్చుకున్నారు. ఉదయాన్నే మూలభావి నీటితో ఆలయాన్ని శుభ్రం చేసి, స్వామివారికి సింధూర పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కలు తీర్చుకున్నారు. భక్తుల కోసం ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లను చేసింది. ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈవో ప్రభు రామచంద్రం, సిబ్బంది సురేందర్, పూజారులు శ్రీనివాస్ శర్మ తదితరులు పాల్గొన్నారు.