శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో విశేష పూజలు

Special Pujas at Sri Matsyagiri Lakshminarasimhaswamy Templeనవతెలంగాణ – వలిగొండ రూరల్
మండల పరిధిలోని వెంకటాపురంలోగల శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహ స్వామీ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం ద్వారతోరణ, ధ్వజకుంభ ఆరాధన, మూర్తి కుంబారాధన, చతుస్థానార్చన, నిత్యాహోమాలు, సుదర్శన నారసింహ ఇష్టి,పూర్ణాహతి,బలిహరణం, నివేదన, తీర్థప్రసాద గోష్ఠి, కార్యక్రమాలు వేద పండితులు శాస్త్రోక్తoగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి సల్వాది మోహన్ బాబు, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కొమ్మారెడ్డి నరేష్ కుమార్ రెడ్డి,ధర్మకర్తలు,అర్చకులు,సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.