నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో బీఏ, బీఎస్సీ, బీకాం, బీకాం ఒకేషనల్, బీకాం ఆనర్స్, బీఎస్డబ్ల్యూ, బీబీఏ, బీసీఏ, బీబీఎం, బీసీఏ కోర్సుల్లో ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం 2024-25 విద్యాసంవత్సరంలో డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్)కు సంబంధించి ప్రయివేటు డిగ్రీ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు దోస్త్ కన్వీనర్, ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రయివేటు డిగ్రీ కాలేజీల్లో అన్ని కోర్సులకు, ఎయిడెడ్ కాలేజీల్లో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకు స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియను ఈనెల 27 వరకు నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థులు పూర్తి వివరాలకు https://dost.cgg.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.