నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పదో తరగతి ఫలితాల్లో శ్రీచైతన్య విద్యాసంస్థ విజయదుందుబి మోగించింది. 1,402 మంది విద్యార్థులు పదికి పది జీపీఏను సాధించారని శ్రీచైతన్య స్కూల్స్ డైరెక్టర్ సీమ చెప్పారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ 9.8 జీపీఏ ఆపైన సాధించిన విద్యార్థులు 2,803 మంది, 9.5 జీపీఏ ఆపైన సాధించిన విద్యార్థులు 5,207 మంది, 9.0 జీపీఏ ఆపైన సాధించిన వారు 8,216 మంది ఉన్నారని వివరించారు. తమ విద్యాసంస్థలో 99.2 శాతం ఉత్తీర్ణత నమోదైందని చెప్పారు. వంద శాతం ఉతీర్ణత పొందిన తమ బ్రాంచ్లు 84 ఉన్నాయని అన్నారు. మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టుల్లో ఏ గ్రేడ్ సాధించిన విద్యార్థులు 17,913 మంది ఉన్నారని వివరించారు. గ్రేడ్ పాయింట్స్ అయినా, మార్కులైనా పదో తరగతి ఫలితాల్లో ఎల్లప్పుడూ శ్రీచైతన్య నెంబర్వన్ స్థానంలో నిలుస్తుందని చెప్పారు.
ప్రతి విద్యార్థిపైనా వ్యక్తిగత శ్రద్ధ, రీసెర్చ్ ఓరియెంటెడ్ టీచింగ్ మెథడాలజీ, సీ ఐపీఎల్, ఎంపీఎల్, ఐకాన్, సీబ్యాచ్, సివిల్స్, మెడికాన్, టెక్నో వంటి పటిష్టమైన అకడమిక్ ప్రోగ్రామ్లు, మైక్రోస్థాయి బోధనతోపాటు అంకితభావంతో పనిచేసే ఉపాధ్యాయుల వల్ల ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని చెప్పారు. జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్, నీట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో మొదటి ర్యాంకులు సాధించిన విద్యార్థులు శ్రీచైతన్య స్కూల్ విద్యార్థులేని అన్నారు. ఈ విజయానికి కారణమైన విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులను ఆమె అభినందించారు.