
కాటారం మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీపాద స్మారక జిపిఎల్ -1 క్రికెట్ టోర్నమెంట్ లో విజయం సాధించిన జట్లకి తెలంగాణ రాష్ట్ర ఐటి,పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు సోదరుడు, శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ల శ్రీనుబాబు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు క్రీడల వలన మానసిక ఒత్తిడిని తగ్గించే అవకాశం ఉంది కావున అందరూ సాధ్యమైనంత వరకు ఎ క్రీడలోనైన రోజులో కొంత సమయం కేటాయిస్తే ఆరోగ్య వంతంగా జీవించ వచ్చని తెలిపారు.యువకులు కేవలం చదువుతూనే కాకుండా క్రీడా రంగం లో కూడా ఉన్నత శిఖరాలను అధిరోహించే అవకాశం ఉందని అలాగే యువతి యువకులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రీడా రంగం లో ముందుకు వెళ్ళాలని కోరారు.