దేశంలోనే అతిపెద్ద ప్రయోగశాల ఏర్పాటు : కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణకు మరో పెట్టుబడి రాను న్నది. స్టెమ్ క్యూర్స్ కంపెనీ హైదరాబాద్లో తయారీ ల్యాబ్ని ఏర్పాటు చేసేందుకు ముందు కొచ్చింది. ఈ ల్యాబ్ ప్రధానంగా స్టెమ్ చికిత్సపై దష్టి సారిస్తుంది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద స్టీమ్ సెల్ మ్యానిఫ్యాక్చరింగ్ ప్లాంట్. దాదాపు 54 అమెరికన్ మిలియన్ డాలర్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ తయారీ యూనిట్తో 150 మందికిపైగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ స్టెమ్ క్యూర్స్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ సాయిరాం అట్లూరితో బోస్టన్ నగరంలో సమావేశం అయ్యారు. అమెరికాలో ఉన్న అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని నైపుణ్యాన్ని భారతదేశానికి తీసుకొచ్చి తీవ్రమైన వ్యాధులకు స్టెమ్ సెల్ ఉత్పత్తులతో చికిత్సను అందించడమే ఈ కంపెనీ లక్ష్యం.
ప్రపంచ మెడికల్ ఇన్నోవేషన్కు తన సొంత నగరమైన హైదరాబాద్ హబ్గా మారిందని సాయిరాం అట్లూరి సంతోషం వ్యక్తం చేశారు. తమ సంస్థకు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా మంత్రి కేటీఆర్ అందిస్తున్న సహకారానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
స్టెమ్ క్యూర్స్ కంపెనీని హైదరాబాద్కు ఆహ్వానిస్తున్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. కంపెనీ పెట్టుబడి ప్రకటన పట్ల హర్షం వ్యక్తం చేసిన ఆయన సంస్థకు కావాల్సిన సహాయ సహకారాలను ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. అత్యంత తీవ్రమైన వైద్య, ఆరోగ్య సమస్యలకు స్టెమ్ సెల్ థెరపీతో పరిష్కారం లభిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఈ అత్యాధునిక చికిత్సా విధానాలు దేశంలో విస్తతంగా అందుబాటులోకి రావాలన్నారు. స్టెమ్ క్యూర్ సంస్థ ఏర్పాటు చేయనున్న ల్యాబ్తో దేశంలో ఈ చికిత్సా విధానాలు అందరికి అందుతాయన్న ఆశాభావాన్ని మంత్రి కేటీఆర్ వ్యక్తం చేశారు.
నల్లగొండలో ఐటీ టవర్
త్వరలోనే ప్రారంభం
ముందుకొచ్చిన సొనాటా సాఫ్ట్వేర్
నల్లగొండ పట్టణానికి ఐటీ పరిశ్రమ రానున్నది. త్వరలో ప్రారంభం కానున్న ఐటీ టవర్లో తన కార్య కలాపాలు ప్రారంభించేందుకు ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ సొనాటా ముందుకొచ్చింది. ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఐటీ పరిశ్రమను విస్తరించాలన్న తెలం గాణ ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా నల్గొండ ఐటీ టవర్లో సుమారు 200ఉద్యోగాలను సొనాటా సాఫ్ట్వేర్ కల్పించనున్నది.
సొనాటా సాఫ్ట్వేర్ కార్య నిర్వాహక ఉపాధ్యక్షులు శ్రీని వీరవెల్లి మంత్రి కేటీఆర్తో అమెరికాలోని బోస్టన్ నగరంలో సమా వేశం అనంతరం ఈ ప్రకటన వెలువడింది. బ్యాం కింగ్, ఫైనాన్షియల్ సెక్టార్, ఆరోగ్య రంగం, లైఫ్ సైన్సెస్ రంగాల్లో సేవలు అందించేందుకు అవసర మైన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, టెక్నాలజీ ఇన్నోవేషన్ల కోసం సొనాటా కార్యకలాపాలు నిర్వహించనున్నది. ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించనున్న కంపెనీ స్థానిక యువతకు టెక్నాలజీ రంగంలో నైపుణ్య శిక్షణ కల్పించ నుంది. మంత్రి కేటీఆర్ తో జరిగిన సమావేశంలో తెలంగాణ పరి శ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, పెట్టుబడుల ప్రత్యేక కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి చీఫ్ రిలేషన్స్ ఆఫీసర్ అమర్నాథ్రెడ్డి ఉన్నారు.