నఖిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం: ఏఓ

నవతెలంగాణ – పెద్దవూర
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మండల వ్యవసాయశాఖ అధికారి సందీప్ అన్నారు. శుక్రవారం మండలం లోని గర్నెకుంట గ్రామం లో రైతులకు నఖిలీ విత్తనాల పట్ల తీసుకోవలసిన జాగ్రత్తల గురించి, సాగు విధానం పై అవగాహన కల్పించి మాట్లాడారు.మండలంలోని రైతులు గుర్తింపు పొందిన విత్తన దుకాణాల్లో మాత్రమే విత్తనాలను కొనుగోలు చేయాలని రైతులకు తెలుపారు.అదే విధంగా ఏ ప్రాంతంలోనైనా కచ్చితమైన కంపెనీ పేరు, బిల్లులు లేకుండా విడిగా విత్తనాలు విక్రయిస్తే వెంటనే మండల వ్యవసాయ అధికారి కార్యక్రమంలో సమాచారం ఇవ్వాలని తెలిపారు.పత్తి విత్తనాలు అధిక ధరకు విక్రయిస్తే లైసెన్స్‌లు రద్దు చేస్తామన్నారు.విత్తన డీలర్లు రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు విక్రయించాలని తెలిపారు. రైతులు కూడా విత్తనాల కొనుగోలు సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కొనుగోలు చేసిన విత్తనాలకు సంబంధించి దుకాణాదారు నుంచి రశీదు తీసుకోవాలన్నారు. లైసెన్సు ఉన్న డీలర్స్ దగ్గర మాత్రమే ప్రత్తి విత్తనాలు కొనాలని, మంచి నాణ్యతా ప్రమాణాలు ఉన్న పాకెట్లలో ఉన్న ప్రత్తి విత్తనాలు మాత్రమే కొనుగోలు చేయాలని తెలిపారు.లూసు విత్తనాలు కొనుగోలు చేయవద్దని సూచించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు మహేశ్వరీ, ఆంజనేయులు, రైతులు ఉన్నారు.