
డీఎస్పీ మద్దతూ…
జీతాలు సక్రమంగా ఇప్పించాలని కోరుతూ సమ్మె చేస్తున్న మెడికల్ కళాశాల సిబ్బందికి ధర్మ సమాజ పార్టీ మదర్ తెరిపింది. ధర్మ సమాజ్ పార్టీ జిల్లా నాయకులు శంకర్, జగన్ లు మాట్లాడుతూ సిబ్బంది అతి తక్కువ వేతనాలను కూడా సక్రమంగా అందివ్వకుంటే వారి కుటుంబాలు ఎలా గడుస్తాయని ప్రశ్నించారు. 14 రోజులుగా సమ్మె చేస్తున్న అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. తక్షణం వారి సమస్యలను పరిష్కారం చేయాలని లేని పక్షంలో శానిటేషన్, సెక్యూరిటీ సిబ్బందితో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి నాయకులు సైదులు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.