రాజకీయ ప్రత్యర్థులను వేధించడమే లక్ష్యంగా మోడీ సర్కారు కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియో గం చేయడానికి బరితెగిస్తోంది. ఈ విషయమై ఎన్ని విమర్శలు చేసినా కేంద్ర ప్రభుత్వ వైఖరిలో నామ మాత్రపు మార్పు కూడా కనిపించడంలేదు. ప్రతిపక్షాలన్నీ కలిసి మూకుమ్ముడిగా అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్ర యించాల్సి వచ్చిందంటే పరిస్థితి తీవ్రతను అర్ధం చేసు కోవచ్చు. అయినా.. ఈడి, సిబిఐ వంటి సంస్థలను తమ జేబు సంస్థలుగానే మోడీ ప్రభుత్వం భావిస్తోంది. ప్రతి పక్షనేతలను నయానో, భయానో లొంగదీసుకోవడానికి, అలా లొంగని వారిని కేసులతో వేధించడానికి ఆ సంస్థ లను దుర్వినియోగపరుస్తున్న తీరు జుగప్స కలిగిస్తోంది. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను ఇడి అధికా రులు ఏడు గంటలకు పైగా ప్రశ్నించి, అరెస్ట్ చేయడం బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీయాదవ్ను లక్ష్యంగా చేసుకోవడం దర్యాప్తు సంస్థల దుర్వినియోగా నికి తాజా నిదర్శనం. బీజేపీ నిరంకుశ పోకడలకు వ్యతి రేకంగా గట్టిగా పోరాడుతున్నందునే ఈడి వీరిని లక్ష్యం గా చేసుకుంది. బీహార్లో మహాకూటమి ప్రభుత్వం నుండి నితీష్ కుమార్ వైదొలిగి బీజేపీ పంచన చేరిన మరుసటి రోజే ఈడి విచారణ ప్రక్రియ ప్రారంభం కావడం గమనార్హం. సిబిఐ నమోదు చేసిన కేసు ఆధా రంగా తేజస్వీ తండ్రి, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్కు కూడా ఇటీవలే ఈడి నోటీసులు జారీ చేసింది. బీజేపీ, ఆర్ఎస్ఎస్లకు వ్యతిరేకంగా దశాబ్దాల తరబడి లాలూ సాగిస్తున్న పోరాటం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేశ రాజధాని ఢిల్లీలోనూ ఇదే స్థితి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆప్ అధ్యక్షుడు కేజ్రివాల్తో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు ఈడి బాధితు లుగా మారడానికి కారకులెవరో అందరికీ తెలిసిందే. ఇలా చెప్పు కుంటూపోతే బీజేపీ దుర్నీతికి, దుర్వినియో గానికి ఉదాహరణాలెన్నో!
2014వ సంవత్సరంలో నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుండి గతేడాది జనవరి వర కు దేశవ్యాప్తంగా 121 మంది రాజకీయ నేతలపై ఈడి కేసులు పెట్టి విచారణ చేపట్టింది. వీరిలో 115 మంది అంటే 95 శాతం మంది ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు చెందినవారు, బీజేపీని గట్టిగా వ్యతిరేకించేవారే కావడం గమనార్హం. ఇలా కేసులు నమోదైన వారు బీజేపీలో చేరి తే వెంటనే వారిపై నమోదైన కేసులను ఎత్తివేయడం, వారిలో కొందరికి ప్రభుత్వ పదవులను సైతం కట్ట బెట్టడం మోడీ సర్కారు బరితెగింపునకు మరో నిదర్శ నం. మరోవైపు ఈడి కేసుల్లో నేరం రుజువై శిక్షపడినవి చాలా తక్కువ. అధికారిక లెక్కల ప్రకారం 2011 నుండి ఈడి 1600 కేసులు నమోదు చేసి, 1800 దాడులను ఈడి నిర్వహించింది. అయితే, నేరం రుజువై శిక్ష పడింది మాత్రం కేవలం పది మందికి మాత్రమే! గడిచిన 18 ఏండ్లలో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పిఎం ఎల్ఏ) కింద 5,422 మందిపై ఈడి కేసులు పెట్టి దర్యాప్తు చేయగా, 23మందికి మాత్రమే శిక్ష పడింది. ఇది కేవలం 0.5శాతం మాత్రమే! అయినా, భయపడు తున్నారంటే ఇతర దర్యాప్తు సంస్థలకు లేని ప్రత్యేక అధికా రాలు ఈడికి ఉండటమే కారణం. ముఖ్యంగా న్యాయ స్థానాల అనుమతి లేకుండానే ఆస్తులు జప్తు చేసే అధి కారం ఒకసారి కేసు నమోదైతే నేరం చేయలేదని రుజువు చేసుకునే బాధ్యత నిందితునిపైనే మోపడం వంటి అధికారాలను ఈడికి అప్పగించారు.
ప్రస్తుత పార్లమెంటులోని ప్రతిపక్ష సభ్యుల్లో దాదాపు 90 శాతం మంది ఏదో ఒక కేంద్ర దర్యా ప్తు సంస్థ నిఘానీడలో ఉన్నట్లు ఇటీవల విడుద లైన ఒక నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలోనే తమిళనాడు, పశ్చిమబెంగాల్ ప్రభుత్వాలు ఈడి దాడులను అడ్డుకోవడంతో పాటు, ఆ సంస్థ సి బ్బందిపై కేసులు నమోదుచేశాయి. తాజాగా జా ర్ఖండ్లో హేమంత్ సోరెన్ కూడా ఈడి అధికా రులు తన ప్రతిష్టను దెబ్బతీస్తున్నారంటూ కేసు దాఖలు చేశారు. తీవ్రస్థాయిలో జరుగుతున్న ఈ అధికార దుర్వినియోగాన్ని అరికట్టి, దర్యాప్తు సం స్థల నిష్పాక్షికతపై ప్రజానీకంలో తిరిగి నమ్మకం కలిగించాలంటే అధికారం నుండి బీజేపీని సాగ నంపడం ఒక్కటే మార్గం. ఈ లక్ష్యసాధనకు ఐక్యంగా కృషి చేయాల్సిన బాధ్యత ప్రతిపక్షాలపై ఉంది.