”మానవ సంస్కృతి వికాసానికి భిన్నాభిప్రాయాల వ్యక్తీకరణ లేదా అసమ్మతి కారణం.ప్రపంచంలోని జ్ఞానం ప్రశ్నించకుండా అభివృద్ధి చెందదు. ఆధునిక సమాజంలో భిన్నాభిప్రాయాలు ఉండటం, పౌరులు అసమ్మతులు వ్యక్తపరచడం వారి వాక్ స్వాతంత్య్రంలో తప్పనిసరిగా ఒక భాగమై ఉండాలి. సమాజాలు నిరంతరంగా కొనసాగాలంటే ఇది అత్యంత కీలకం.” అని అంటారు ప్రముఖ చరిత్రకారిణి రోమిల్లా థాపర్.
మానవజాతి తన మనుగడ కోసం, తను జీవించడానికి ప్రభావితం చేసే అంశాల గురించి భిన్నాభిప్రాయాలను వ్యక్తపర చడం వల్లనే మానవ సంస్కతి, సమాజం అభివృద్ధి కాగలిగింది. బానిస వ్యవస్థ, రాచరిక వ్యవస్థలు పోయి పెట్టుబడిదారి సమా జం పెంపొందింది. ఇందులో లౌకికవాదం ఒక అంశం మాత్రమే. అయితే పెట్టుబడిదారి ఆధిపత్యం తన రూపాన్ని మార్చుకుంది. ఉదారంగా ప్రజలకు కొన్ని హక్కులు, వెసులుబాటులిస్తూ సంప న్నవర్గం తన ఆధిపత్యాన్ని, దోపిడీని చెలాయిస్తుంది. చారిత్రాత్మ కంగా ఈ ప్రశ్నించేతత్వం, ధిక్కారము ఉన్నాయనడానికి వలస వాదం నుండి విముక్తి అయిన దేశాలే ఉదాహరణలు.ఆధునిక పౌరసమాజం కూడా ఇదే ఘర్షణను అసమ్మతిని, ప్రశ్నించే హక్కును కాపాడుకోవడానికి దినదిన సంఘర్షణలు పడాల్సి వస్తుంది.
మార్కెట్పై ఆధిపత్యం కోసం జరిగిన రెండు ప్రపంచ యుద్ధాలు మానవ హక్కుల సార్వత్రిక ప్రకటనను రూపొందించ డానికి దారితీశాయి. అందరికీ స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, శాంతి, గౌరవం, రక్షణకు 1948, డిసెంబర్ 10న ఐక్యరాజ్య సమితి ప్రపంచ మానవ హక్కుల దినోత్సవంగా ప్రకటించి ఇటీ వల వజ్రోత్సవం కూడా జరుపుకున్నది. అయినా ప్రపంచంలో ఏదో ఒక మూల ప్రతిరోజు ఈ హక్కుల కోసం పోరాటాలు సాగు తూనే ఉన్నాయి. బంగ్లాదేశ్లో ఏడాది కాలం నుండి ప్రభుత్వ నిరంకుశత్వం, అప్రజాస్వామికం, పత్రికాస్వేచ్ఛహరణ, అవినీతి, పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా, పారదర్శకమైన ఎన్నికల కోసం జరుగుతున్న సమ్మెలో పోరాటాల్లో ముగ్గురు ఉద్యమకా రులు, ఒక పోలీసు మరణించారు. ఐర్లాండ్లో దాని జనాభాలో ఒక శాతానికి సమానంగా తరలివచ్చిన శరణార్థులను బహిష్క రించడం గురించి, స్థానిక ప్రజలకు నివాసాల ఏర్పాటు గురించి గతేడాది నుండి ఆందోళనలు జరుగుతుంటే ఆ శరణార్థుల ఆశ్ర యాల కోసం కూడా మరో పక్క ఆందోళనలు జరుగుతున్నాయి. ఇజ్రాయిల్, గాజాపై చేస్తున్న అమానవీయ దాడులకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల నిరసన ప్రదర్శనలు జరిగాయి. స్వయంగా ఇజ్రాయిల్ ప్రజలే యుద్ధాన్ని ఆపాలి అంటూ తమ భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేశా రు. పాలస్తీనా ప్రజలకు మద్దతు తెలిపారు. నేత న్యాహు ప్రభుత్వం ఆందోళనలు చేస్తున్న ఉద్యమకా రులను అక్రమంగా నిర్బంధించింది. యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న పత్రికలను రద్దు చేసింది.
ఇలా ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల కోసం మనుగడ కోసం స్థానిక ప్రజల పోరాటాలు సాగుతున్న నేపథ్యంలో ఆందోళనకారులపై, మాన వహక్కుల ఉద్యమకారులపై ప్రభుత్వం విరుచుకుని పడుతూనే ఉంది. ఇలా నిరంకుశంగా వ్యవహరిం చడంలో భారత ప్రభుత్వమూ తీసిపోలేదు. గ్లోబల్ ఇండెక్స్ ర్యాం కింగ్లో ప్రపంచ సంతోష సూచికలో 126/146 వ స్థానం లోనూ, పత్రికాస్వేచ్ఛలో 161/180, ప్రపంచ శాంతి సూచికలో 135/163, లింగ వివక్షతలో 135/146, ఆకలి సూచికలో 107/121వ స్థానంలోనూ ఉన్నాయి. స్వీడన్కు చెందిన వీ- డెమ్ సంస్థ సర్వే ప్రకారం భారతదేశాన్ని ఎన్నికల నిరంకుశత్వం గల రాజ్యంగా వర్గీకరించింది. ఎందుకంటే ప్రజాస్వామ్యంపై బహుళ కోణాల నుండి ఆంక్షలు విధించబడుతున్నాయి.బహుళ కోణాల నుండి అంటే కొన్ని ప్రజా సమూహాలపై వాక్ స్వాతం త్య్రం నిర్బంధం జరుగుతుంది. కుల, మత రాజకీయాలు పెరుగు తున్న పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. అభ్యుదయం, సైద్ధాంతి కత్వంపై దాడులు పెచ్చ రిల్లుతున్నాయి.
జాతీయ హింస వ్యతిరేక ప్రచార సంస్థ (ఎన్సి ఎటి) 29 జూన్ 2020లో ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 2019లో రోజుకు ఐదు గురు చొప్పున 1731 పోలీస్ కస్టడీ మరణాలు సంభవించాయి. వీరంతా దుర్బలమైన వారు, దళితులు, ముస్లింలు, ఆదివాసీలు. సిఏఏ, ఎన్ఆర్సికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమ సంద ర్భంలో 2020లో జాతీయ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో ప్రకా రం (ఎన్సిఆర్బి)మతపరమైన అల్లర్లలో 62 మంది చనిపోయారు ఈ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారు లపై ‘ఉప’ చట్టంతో దేశద్రోహం కేసులు పెట్టడం, వారి నివాస ప్రాంతాలను, దుకాణాలను, ఆస్తులను బుల్డోజ ర్లతో ధ్వంసం చేశారు. 3 మే 2023లో మణిపూర్లో మైతీ – కుకీలు (మెజారిటీ – మైనారిటీ) జాతుల మధ్య జరిగిన హింసలతో 175 మంది మరణించారు. 118 మంది గాయపడ్డారు. ఈ మారణకాండలో మైనారిటీ జాతికి చెందిన మహిళలను నగంగా ఊరేగించి, బలత్కరించి హత్యచేశారు.
2002లో గుజరాత్లో జరిగిన అల్లర్లలో అధికారిక లెక్కల ప్రకారం 790 మంది ముస్లింలు, 254 మంది హిందువులు 1044 మంది పౌరులు చనిపోయారు. ఈ మారణకాండలో మా నవ హక్కులపై జరిగిన దాడులకు వ్యతిరేకంగా మానవ హక్కుల ఉద్యమకారిణి తీస్తా సెతల్వాడ్ ఉద్యమించినందుకుగాను కేసులు, నిర్బంధాలు ఎదుర్కొంటున్నారు. గిరిజనుల రక్షణ, సంక్షేమం, అభివృద్ధి కోసం గళమెత్తిన స్టాన్ స్వామినీ అక్రమ కేసులతో ప్రభు త్వం నిర్బంధించి జైల్లోనే ఆయన మరణానికి కారణమైంది. కులాంతర వివాహాలను ప్రోత్సహించిన ఉద్యమకారుడు గోవింద్ పన్సారే, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన నరేంద్ర దబూల్కర్, కుల వ్యవస్థను ధిక్కరించిన గౌరీలంకేష్లు నిర్దాక్షిణ్యం గా కాల్చబడ్డారు. హత్రాస్ కేసులో నిజానిజాలు బయటకు తేవడానికి ప్రయత్నించిన పాత్రికేయుడు సిద్ధిఖ్ కప్పన్పై యూపీ ప్రభుత్వం దేశద్రోహ కేసు పెట్టి రెండేళ్లు జైలు శిక్ష అనుభవించేలా చేసింది. డిజిటల్ మీడియా సంస్థ న్యూస్క్లిక్పై దాడి, దాని వ్యవ స్థాపక సంపాదకులు ప్రబీర్ పురకాయస్థ అరెస్టు, ఇలా అనేక నిర్బంధాల ఉదాహరణలు చూడవచ్చు.
ఈ విధంగా భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా మానవ హక్కుల కోసం పోరాడుతున్న ఉద్యమ కారులపై నిర్బం ధాలను ప్రయోగించడంలో రాజ్యం, ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధం గానే ఉంటుంది. పోరాటం జరుగుతున్న ప్రాంతాలను చీకటి మయం, చేస్తూ ప్రపంచానికి ఏమీ తెలియకుండా దూరం చేసి, ఇంటర్నెట్లు, విద్యుత్తు ఆపివేసి, మీడియాని నియంత్రించి, అన్ని రకాల నిర్బంధాలను ప్రయోగిస్తుంది.పై ఉదాహరణలన్నీ మానవ హక్కుల హననం ఏ విధంగా జరుగుతున్నాయో తెలియ జేస్తున్నాయి.
మానవ జీవితం పవిత్రమైనదని ఒక్కోమతంలో ఒక్కో రకం గా మత నమ్మకాలు విశ్వాసాలు ఉన్నాయి. కొన్ని మతాలైతే పునర్జ న్మను కూడా విశ్వసిస్తాయి. కానీ ఆధునిక మానవ హక్కులు మానవతావాదంతో కాపాడబడతాయి. ఈ మానవ జీవితాన్ని జీవించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. చరిత్రను చూస్తే గతంలో కొందరికే ఉన్న ఓటు హక్కు, ఆస్తిహక్కు పోరాటాలతోనే అందరికీ సాధించబడ్డాయి. యుద్ధాలలో ప్రాణాలు కోల్పోయిన వారి తల్లు లు, భార్యలు, ఆడపడుచులు ధిక్కరించటంతో శాంతి ఒప్పందా లు చేసుకోవలసి వచ్చింది. తన ఆయుధాలను అమ్ముకోవడానికి యుద్ధాలను ప్రేరేపిస్తున్న సామ్రాజ్యవాద అమెరికాను ప్రపంచం దోషిగా చూస్తున్న సమయంలో, దానికి తల వంచుతున్న దేశాల వైపు ప్రజలు, ప్రజా పోరాటాలతో వేలెత్తి చూపాలి.ఆధిపత్యం కోసం మృగాల కంటే హీనంగా ప్రవర్తిస్తున్న వారిని వెలివేయాలి. రోజా లగ్జం బర్గ్ అన్నట్టు ”ఏం జరుగుతూ ఉన్నదో బిగ్గరగా చెప్పడమే, ఎవరైనా, ఎప్పుడైనా చేయగల అత్యంత విప్లవాత్మ కమైన పని.” ఆ పనిని మానవతావాదులు చేయాలి. హక్కుల సాధనకు, భద్రత కొరకు చరిత్ర చెప్పిన పాఠం.. పోరాటాలే శరణ్యం.
యం.డి.షకీల బేగం