దేశంలో ఆరెస్సెస్ ఎజెండాను కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం పక్కాగా అమలు చేస్తోంది. ఇప్పటికే బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాలలో విద్యారంగంలో చొరబడి పాఠ్యాంశాలను పూర్తిగా కాషాయమయంగా మార్చింది. రాష్ట్రాల్లోనే కాదు దేశంలోను సిబిఎస్ఈ సిలబస్ రుపొందించే ఎన్సీఈఆర్టీని ఉపయోగిం చుకుని చరిత్ర, సైన్స్ను మార్పు చేస్తోంది. జాతీయోద్యమ వీరుల చరిత్రల స్థానాలలో ఆరెస్సెస్ సిద్ధాంతకర్తల జీవిత చరిత్రలను ప్రవేశపెడుతోంది. యూనివర్శిటీ పాఠ్యాంశాలలో పురాణాలను చేర్చడం, నూతన విద్యావిధానం పేరుతో ఏకంగా దేశ విద్యారంగాన్నే మార్చే కుట్రలను చేస్తోం ది. అందులో భాగమే అశాస్త్రీయ భావజాలాన్ని పెం పొందించడం, పాఠ్యంశాల వక్రీకరణ. కేవలం పా ఠ్యంశాలు మార్చడమే కాకుండా, ఆరెస్సెస్ కార్యకర్త లను విద్యారంగంలో ప్రధానంగా యూనివర్శిటీలలో నియమిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. యూజీసీ చైర్మన్ మొదలు, జెఎన్యూ, హెచ్సీ యూ, పాండిచ్చేరి వంటి కేంద్ర యూనివర్సిటీల వీసీలుగా,విద్యారంగంలో కీలకమైన పదవుల్లో వారి ఏజెంట్లను చేర్చి విద్యను కాషాయికరిస్తోంది. ఈ ఫార్ములాను ఉపయోగించే ఆరెస్సెస్, దాని భావజాలాన్ని ఎదిరించి నిలబడిన, నిలుస్తున్న కేరళపై ప్రయో గించాలనుకుంటోంది. ఇప్పటికే అక్కడి వామపక్ష ఎల్డీఎఫ్పై అనేక కుతంత్రాలు చేసి విఫలమైంది. నిజాయితీ, నిస్వార్థానికి మారుపేరైన ముఖ్యమంత్రి పినరయి విజయన్ను అవినీతి కేసులో ఇరికించాలని చూసి, నిరూపించలేక బదానం అయింది. అక్కడి శబరిమలై గుడి విషయంలో వివాదాస్పద రాజకీయాలకు తెరలేపింది. అయితే వీటన్నింటి దేశంలోనే అత్యధిక అక్షరాస్యత కలిగిన ప్రజలు తిప్పికొట్టారు. ఎప్పటినుంచో అక్కడ తిష్ట వేయాలని చూస్తున్న బీజేపీకి ఎలాంటి సాకు దొరకడం లేదు. దీనికి వారు కనుసన్నల్లో పనిచేసే గవర్నర్ను ఉపయోగిం చుకొని కేరళ రాష్ట్ర యూనివర్సిటీలో ఆరెస్సెస్ ఏజెంట్లను నియమించాలని ప్రయత్నం చేస్తోంది. సాధరణంగా రాష్ట్రాల్లో గవర్నర్ ఎక్స్-అఫిషియో ఛాన్సలర్గా ఉన్నప్పటికీ విశ్వవిద్యా లయాల పని తీరులో వారు జోక్యం చేసుకోరు. కానీ కేరళలో బీజేపీ నియమించిన గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ చర్యలతో అది పూర్తిగా మారిపోయింది. ఇప్పటికీ బీజేపీ – ఆరెస్సెస్ చర్య లు భారతదేశంలో ఉన్నత విద్యలో లౌకిక ,వైజ్ఞానిక లక్షణాన్ని నా శనం చేశాయి. వేలాది మంది ఆరెస్సెస్, బీజేపీ, ఏబీవీపీ సభ్యు లను కళాశాలలు, యూనివర్సిటీలలో అధ్యాపకులుగా, ప్రొఫె సర్స్గా, ఇతర సిబ్బందిని నియమించడం ద్వారా మత భావ జాలాన్ని పెంపొందించే ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తోంది.
అయితే యూనివర్శిటీల అడ్మినిస్ట్రేషన్లో ఆరె స్సెస్ వ్యక్తులను నింపి వారి భావాలను విస్తత పర్చడానికి చేసిన ప్రయత్నాలను కేరళలో బెడిసి కొట్టింది. కేరళలో అన్ని క్యాంపస్సలో ఏబీవీపీ ఆధిపత్యం సాధించలేకపోతోంది. మొదటి నుండి కేరళలో క్యాంపస్లో విద్యార్థుల తరుపున పోరా డుతున్న ఎస్ఎఫ్ఐ వెనకాలే విద్యార్థులు ఉ న్నారు. గత ఆగస్టు నుండి కేరళలో జరిగిన ఎన్ని కల్లో రాష్ట్ర, సెంట్రల్ యూనివర్శిటీలలో మతో న్మాద ఏబీవీపీని ఎస్ఎఫ్ఐ మట్టికరిపిస్తూ వస్తోంది. దీనిని నియంత్రించాలనే కుట్ర కూడా ఆరెస్సెస్ చేస్తోంది. ఆరెస్సెస్ ఎజెండాను కేరళలో తమ ప్రజలు విశ్వవి ద్యాలయాలలో, వారి ప్రజాస్వామిక పద్ధతులను అనుసరి స్తున్నంత వరకు రాష్ట్ర పరిపాలన సంస్థలను ఆరెస్సెస్ కైవసం చేసుకోవడం, బోధన స్థానాలను మత ఛాందసవాదులతో నింప డం సాధ్యం కాదు. అందుకే ఆరెస్సెస్ గవర్నర్తో కేరళ రాష్ట్ర యూనివర్శిటీలలో పాలక మండళ్లలో వారిని నియమించాలనే విశ్వ ప్రయత్నం జరుగుతోంది.
యూనివర్శిటీల్లో సంఘీయులను నింపే కుట్ర!
కేరళ గవర్నర్ ఆరీఫ్ మహ్మద్ ఖాన్ కేరళ కాలికట్ యూని వర్శిటీల పాలక మండళ్లలో సంఘీయులను నింపాలని కుట్రలో సెనేట్లో సభ్యులుగా నియమించారు. పైగా ప్రశ్నించిన ప్రభు త్వం యూనివర్శిటీలలో గవర్నర్ జోక్యం ఏమిటని ప్రశ్నించిన ఎస్ఎఫ్ఐపై తన అక్కసును వెళ్లగక్కి క్రిమినల్స్ అంటూ దూషిం చారు. తను చేసిన నియామకాల గురించి అడిగే హక్కు ఎవరికి లేదని అతని నిరంకుశత్వాన్ని,ప్రజాస్వామ్యం పట్ల ధిక్కరాన్ని వెల్ల డించారు. కేరళలోని కాలికట్, కేరళ యూనివర్శిటీల సెనేట్ సభ్యులను నియమించడమే కాదు, గతంలో కేరళ ప్రభుత్వం యూనివర్శిటీలకు వైస్-ఛాన్సలర్స్ నియమించే సందర్భంగా కూడా ప్రభుత్వం పంపిన సిఫార్సులను ఆమోదించకుండా ఆరె స్సెస్ వ్యక్తులను నియమించే ప్రయత్నం చేశారు. ప్రజా స్వామ్యం, లౌకిక విలువలతో పాలన చేస్తున్న కేరళ దీన్ని అడ్డు కునే ప్రయత్నం చేసింది. తమ రాష్ట్ర యూనివర్శిటీలను ఆరె స్సెస్ స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని, గవర్నర్ విశ్వవిద్యాలయాలలో రాజకీయ జోక్యం చేసుకునేందుకు వీలు లేకుండా, తమ ప్రజలెన్నుకున్న ప్రభుత్వం,ప్రజల అభీష్టం గౌర వించాలని కేరళలో రాష్ట్ర యూనివర్శీటీల ఛాన్సలర్గా గవర్నర్ తొలగించాలని 2022 డిసెంబర్లో కేరళ అసెంబ్లీ ఒక చట్టాన్ని ఆమోదించింది. బిల్లుపై సంతకం పెట్టకుండా ఏడాది పాటు గవర్నర్ నిరాకరించారు. చివరికి సుప్రీంకోర్టు జోక్యంతో 2023 లో రాష్ట్రపతికి పంపారు. నిరంతరం యూనివర్శిటీ లలో రాజ కీయ జోక్యం చేసుకోవడం, ఇప్పుడు కేరళ, కాలికాట్ యూని వర్శిటీీ సెనేట్ సభ్యులను తనకు ఇష్టం వచ్చిన వారిని నియ మించడం వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా క్యాంపస్లలో ‘సంఘీ ఛాన్సలర్ గోబ్యాక్’, ‘మిస్టర్ ఛాన్సలర్, ఇది కేరళ’ అనే బ్యానర్లను అన్ని క్యాంపస్ల ముందు ప్రదర్శిస్తున్నారు. గవర్నర్ కాలికాట్ యూనివర్శిటీ పర్యటన సందర్భంగా యూనివర్శిటీ ముందు ఎస్ఎఫ్ఐ కట్టిన బ్యానర్లను తొలగించాలని గవర్నర్ చిందులు వేస్తూ అధికారులను ఆదే శించి, విద్యార్ధులను క్రిమినల్స్గా అభివర్ణించారు. ఒక్క పక్క గవ ర్నర్ అప్రజాస్వామిక చర్యలను ఖండిస్తూ విద్యార్థులు ఆందోళన చేస్తుంటే ఆరెస్సెస్ గవర్నర్కు అనుకూలంగా క్యాంపస్లలో బ్యా నర్లు కట్టారు. ఇలాంటి చర్యలతో గవర్నర్ కేరళ క్యాంపస్లలో ఆరెస్సెస్ శ్రేణులను నింపాలనే కుట్రలు వ్యతిరేకంగా తమకంటే అర్హత తక్కువ ఉన్నవారిని నియమించారని కొంతమంది కేరళ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో నియమకాలపై హైకోర్టు తాత్కాలిక స్టే విధించింది.విద్యార్థులు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ‘సంఘీ గోబ్యాక్’ అంటూ రాష్ట్రమంతటా ఆందోళనలు కొనసా గుతున్నాయి.
విద్యార్థుల పోరాటం- ప్రజాస్వామ్యానికి స్ఫూర్తిదాయకం
విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని పరిరక్షించడం, మతోన్మాద ప్రయత్నాలు ప్రతిఘటించడం,కేరళలో ఉన్నత విద్య, లౌకిక,శాస్త్రీయ విద్యను పరిరక్షించుకోవడం కోసం విద్యార్థులు చేస్తున్న పోరాటం స్ఫూర్తిదాయకం. పైగా దేశంలో నేడు బీజేపీి రాష్ట్రాల సమైక్య హక్కులపై చేస్తున్న దాడి, వారి ఫాసిస్టు హిం దూత్వ ఎజెండాకు వ్యతిరేకంగా రాష్ట్రాలను అస్థిరపరిచే గవర్నర్ల వ్యవస్థను దుర్వినియోగం చేసేందుకు వారి ప్రయత్నా లకు బలమైన ప్రతిఘటనగా భావించాలి. తమిళనాడు, తెలంగాణ, పంజాబ్, ఢిల్లీ ఇతర రాష్ట్రాల్లో గవర్నర్ల ప్రవర్తన ప్రజాస్వామ్యా నికి, కేంద్ర,రాష్ట్ర సంబంధాలకు పూర్తి విరుద్ధమైవిగా చర్య లున్నాయి. ఈ రాష్ట్రాల్లో పనిచేసే గవర్నర్లంతా బీజేపీ ఏజెం ట్లుగా పనిచేస్తున్నారే విమర్శలు వస్తున్నాయి. కేరళ, తమిళ నాడు, పంజాబ్, తెలంగాణ రాష్ట్రాలలో నేడు నెలల తరబడి అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులను గవర్నర్లు ఆమోదించడం లేదు. కేరళలో జరుగుతున్న ప్రజాస్వామ్య పరిరక్షణ, మతోన్మాద చర్యలకు వ్యతిరేక పోరాటంలో అక్కడి ప్రతిపక్ష కాంగ్రెస్లోని యూడీఎఫ్ పాత్ర కూడా అవమానకరంగా ఉంది. అక్కడ నుండి ఎన్నికైన 18 మంది ఎంపీలు మౌనంగానే ఉన్నా రు. బీజేపీ, కాంగ్రెస్ సమన్వయంతో రాష్ట్ర ప్రభుత్వంపై నిరస నలు కూడా జరుపుతున్నారు. గవర్నర్ నిర్ణయాలు, రాజకీయ జోక్యానికి వ్యతి రేకంగా విద్యార్థులు వీధుల్లోకి వచ్చి పోరాడుతున్నారు. ప్రజా స్వామ్య పరిరక్షణ, బీజేపీ నియంతృత్వంపై చేస్తున్న ఈ పోరాటా నికి దేశంలోని విద్యావంతులు, మేధావులు, లౌకిక, ప్రజాతంత్ర వాదులు మద్దతు తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
టి.నాగరాజు
9490098292