క్రమశిక్షణతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలి

నవతెలంగాణ – పెద్దవూర
విద్యార్థులు క్రమశిక్షణ తో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా ఏటీడీఓ లక్ష్మారెడ్డి విద్యార్థులకు సూచించారు. మంగళవారం మండల కేంద్రం లోని ఆశ్రమ పాఠశాలలో గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆదేశాల మేరకు పదో తరగతి విద్యార్థులకు అమలవుతున్న వంద రోజులు ప్రత్యేక ప్రణాళికను, విద్యార్థుల బెస్టు అటెండెన్సు ను పరిశీలించారు. విద్యార్థులతో ముచ్చడించి మెనూ విషయాలు అడిగి తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం ఆహారాన్ని వేడిగా విద్యార్థులకు వడ్డించాలని, వార్డెన్ ను ఆదేశించారు.తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి వారి నైపుణ్యాలను పరీక్షించడం జరిగింది. అదేవిధంగా పాఠశాల రికార్డులను పరిశీలించి తగు సూచనలు చేశారు.పదవ తరగత పరీక్షలు సమీపిస్తున్న సమయం లో విద్యార్థులు మంచి క్రమ శిక్షణ తో మెలిగి పాఠశాల కు సమాజానికి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చు కోవాలని తెలిపారు. ప్రతి విద్యార్థి కి ఎక్కువ జిపిఏ సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని చేయాల్సిన అవసరం  ఉందని ఉపాధ్యాయులకు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో ప్రన్సిపాల్ బాలాజీ నాయక్, వార్డెన్ బాలకృష్ణ, ఉపాధ్యాయులు రాంరెడ్డి, కృష్ణ, షబ్బీర్, సంధ్య, సురేందర్, సైదులు, శాంతి, షాహిద్ బేగం పాల్గొన్నారు.