ఇండిస్టీ ఎప్పుడూ కొత్త పుంతలు తొక్కుతూనే ఉంటుంది. అందులో భాగమే ఈ 4కే రీరిలీజ్ ట్రెండ్. ఓల్డ్ బ్లాక్ బస్టర్ మూవీస్ను హై క్వాలిటీతో మరోమారు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఉప్పి క్రియేషన్స్, చందు ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై గ్రాండ్గా రీరిలీజ్ అవుతున్న చిత్రం ఏ. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర నటించిన ఈ చిత్రం ఓ ట్రెండ్. 1998లో అంటే సుమారు 26 సంవత్సారాల క్రితం విడుదలైన ఈ సినిమా ఓ కల్ట్ ఫిల్మ్గా నిలిచింది. ఆ రోజుల్లో 100 రోజులు ఆడటమే కాకుండా దాదాపు 3, 4 వారాలు టికెట్లు సైతం దొరకలేదంటే ఆ సినిమా చేసిన మ్యాజిక్ను అర్థం చేసుకొవచ్చు. ఈ కల్ట్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తూ వింటేజ్ రోజులను తెరపై అవిష్కరింపజేస్తున్నారు ప్రొడ్యూసర్ లింగం యాదవ్. చందు ఎంటర్టైన్మెంట్ని స్థాపించి పలు చిత్రాలను నిర్మించడమే కాకుండా సినిమాపై ఉన్న ప్యాషన్తో రీరిలీజ్లకు పూనుకున్నారు. అందులో భాగంగా హీరో ప్రభాస్ నటించిన ‘ఛత్రపతి, యోగి’ చిత్రాలను 4కేలో మళ్లీ విడుదల చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ‘ఏ’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే కన్నడలో రీరిలీజ్ అయిన ఈ చిత్రం అద్భుతమైన స్పందనను రాబట్టింది. ఇక ఈనెల 21న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. కన్నడ ఇండిస్టీలో ట్రెండ్ సెట్ చేసిన సినిమా ఏ (బుద్దిమంతులకు మాత్రమే అనేది శీర్షిక). ఈ చిత్రంలో ఉపేంద్ర సరసన చాందినీ నటించారు. తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం కేవలం కన్నడలో 20 కోట్లకు పైగా వసూల్ చేసి ఇండిస్టీ రికార్డు క్రియేట్ చేసింది. అంతటి కల్ట్ ఫిల్మ్ని మరోమారు చూసేందుకు సినీలవర్స్తోపాటు ఉపేంద్ర అభిమానులు సైతం ఆసక్తికరంగా దురుచూస్తున్నారు అని చిత్ర యూనిట్ తెలిపింది.