సమ్మర్‌ స్పెషల్‌గా రిలీజ్‌

సమ్మర్‌ స్పెషల్‌గా రిలీజ్‌సూర్య తేజ ఏలే డెబ్యు మూవీ ‘భరతనాట్యం’. దొరసాని ఫేమ్‌ కేవీఆర్‌ మహేంద్ర దర్శకత్వంలో పీఆర్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌పై పాయల్‌ సరాఫ్‌ నిర్మించారు. మీనాక్షి గోస్వామి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో వైవా హర్ష, హర్షవర్ధన్‌, అజరు ఘోష్‌, సలీం ఫేకు, టెంపర్‌ వంశీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లీడ్‌ పెయిర్‌ పై చిత్రీకరించిన రొమాంటిక్‌ నెంబర్‌ ‘చేసావు ఎదో మాయను..’ విడుదల చేసిన మేకర్స్‌ సినిమా విడుదల తేదీని కూడా అనౌన్స్‌ చేశారు. ఏప్రిల్‌ 5న వేసవిలో ప్రేక్షకులని అలరించడానికి ఈ సినిమా సిద్ధంగా ఉంది. సమ్మర్‌ హాలిడేస్‌ను సినిమా క్యాష్‌ చేసుకోబోతోంది. తన కథలో హీరోలా జీవితంలో చాలా సమస్యలను ఎదుర్కొనే ఔత్సాహిక ఫిల్మ్‌ మేకర్‌గా ఇందులో సూర్య తేజ కనిపించబోతున్నారు. ప్రోమోల్లో సూర్యతేజ తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ చిత్రానికి వివేక్‌ సాగర్‌ సంగీతం అందించగా, వెంకట్‌ ఆర్‌ శాకమూరి డీవోపీగా పని చేస్తున్నారు. రవితేజ గిరిజాల ఈ చిత్రానికి ఎడిటర్‌.గంగవ్వ, కష్ణుడు, టెంపర్‌ వంశీ, నాగ మహేష్‌, టార్జాన్‌, మాణిక్‌ రెడ్డి, శివన్నారాయణ, సత్తన్న, సంతోష్‌ బాలకష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకత్వం: కేవీఆర్‌ మహేంద్ర, నిర్మాత: పాయల్‌ సరాఫ్‌, కథ: సూర్య తేజ ఏలే, స్క్రీన్‌ ప్లే: సూర్య తేజ ఏలే, కేవీఆర్‌ మహేంద్ర, సంగీతం: వివేక్‌ సాగర్‌, డీవోపీ: వెంకట్‌ ఆర్‌ శాకమూరి, ఎడిటింగ్‌: రవితేజ గిరిజాల, ఆర్ట్‌: సురేష్‌ భీమగాని.