2019లో ‘లూసిఫర్’ విడుదలై బ్లాక్బస్టర్ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్గా ‘ఎల్2 ఎంపురాన్’ తెరకెక్కుతోంది. లైకా ప్రొడక్షన్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ని నిర్మిస్తోంది. మోహన్లాల్ హీరోగా రాబోతోన్న ఈ చిత్రంలో సౌత్ స్టార్లు నటిస్తున్నారు. తొలి భాగం హిట్ కావటంతో సినిమాపై ఎలాంటి అంచనాలున్నాయో ముందుగానే అంచనా వేసిన మేకర్స్ ఎక్స్పెక్టేషన్స్ను మించేలా సినిమాను నిర్మిస్తున్నారు. మోహన్ లాల్, యాక్టర్, డైరెక్టర్ పథ్వీరాజ్ సుకుమార్ కాంబినేషన్లో రానున్న మూడో చిత్రం కావటంతో అభిమానుల్లోనూ అంచనాలు ఆకాశన్నంటాయి. ఇటీవల మోహన్లాల్ పుట్టినరోజు సందర్భంగా ఖురేషి అబ్రమ్గా విడుదల చేసిన లుక్, అలాగే పథ్వీరాజ్ సుకుమార్ పోషిస్తోన్న క్యారెక్టర్ జయేద్ మసూద్కు సంబంధించిన ఫస్ట్ లుక్ను రిలీజ్ చేయగా అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ చిత్రంలో టోవినో థామస్, మంజు వారియర్, నందు, సానియా అయ్యప్పన్ తదితరులు మరోసారి వారి పాత్రలతో మెప్పించబోతున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ను ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చి 27న ఈ చిత్రం తెలుగు, మలయాళం, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ను తెలియజేస్తూ పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. చిత్రానికి నిర్మాతలు: సుభాస్కరన్, ఆంటోని పెరుంబవూర్, రచన: మురళీ గోపి, సినిమాటోగ్రఫీ: సుజిత్ వాసుదేవ్, మ్యూజిక్: దీపిక్ దేవ్, ప్రొజెక్ట్ డిజైన్: పథ్వీరాజ్ ప్రొడక్షన్స్, ప్రొడక్షన్ కంట్రోలర్: సిదు పనకల్, ఆర్ట్: మోహన్ దాస్, ఎడిటర్ : అఖిలేష్ మోహన్.