జిల్లా స్థాయిలో నిర్వహించిన అడోలసెన్స్ ఎడ్యుకేషన్ పోస్టర్ మేళా పోటీలో స్థానిక సన్ షైన్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న కడారి శరణ్య పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను జిల్లా స్థాయిలో ప్రధమ బహుమతి సాధించినట్లు ఆ స్కూల్ కరెస్పాండెంట్ కోడి వెంకన్న తెలిపారు. విద్యార్థినికి జిల్లా జడ్జి రామచంద్రయ్య మెమొంటో, ప్రశంసా పత్రం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లలను చదువుతోపాటు అన్ని రంగాల్లో ముందుకు నడిపిస్తున్నందుకు గాను పాఠశాల యజమాన్యాన్ని మెచ్చుకున్నారు. పాఠశాల కరస్పాండెంట్ కోడి వెంకన్న కి, సంబంధిత ఉపాధ్యాయుడు రవి కి ప్రత్యేక శుభాభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా కరస్పాండ్ కోడి వెంకన్న మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో ప్రతిభ కనబరచడం ద్వారా భవిష్యత్తులో ఉన్నతమైన స్థానాన్ని పొందవచ్చని అన్నారు.