చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ”ధూం ధాం”. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మించారు. దర్శకుడు సాయి కిషోర్ మచ్చా రూపొందించిన ఈ సినిమా ఇటీవల విడుదలై సకుటుంబంగా ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర సక్సెస్ మీట్ ను రామానాయుడు స్టూడియోలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
గోపీ మోహన్ మాట్లాడుతూ – మా ”ధూం ధాం” సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. యూఎస్ నుంచి కూడా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మంచి సినిమా చేశామని ప్రశంసలు దక్కుతున్నాయి. థియేటర్స్ కు వస్తే తప్పకుండా ప్రతి ఒక్కరూ ఎంటర్ టైన్ అవుతారు’ అని అన్నారు.
దర్శకుడు సాయికిషోర్ మచ్చా మాట్లాడుతూ,’ ఈ సినిమాకి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అనే పేరు వస్తోంది. రిలీజైన ప్రతి సెంటర్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. నాకు కనీసం వంద ఫోన్ కాల్స్ వచ్చి ఉంటాయి. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, బెనర్జీ, సాయి శ్రీనివాస్ వంటి వారి క్యారెక్టర్స్ చూస్తూ ప్రేక్షకులు బాగా నవ్వుతున్నారు’ అని తెలిపారు.
నిర్మాత రామ్ కుమార్ మాట్లాడుతూ, ‘పెద్ద సినిమాల పోటీలో ”ధూం ధాం” లాంటి చిన్న సినిమా నిలదొక్కుకోవడమే గొప్ప విషయం. మేము ఇంకా పరుగు స్టార్ట్ చేయలేదు. నిలబడ్డాం అంతే. మా మూవీని ఆడియెన్స్ దాకా రీచ్ చేసిన క్రెడిట్ మీడియా మిత్రులదే. తర్వాత ఓటీటీలో చూద్దాంలే అని అనుకోకుండా ఈ సినిమాను థియేటర్ లో అనుభూతి చెందండి. ఎందుకంటే ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమాను 2, 3 వందల మంది ప్రేక్షకుల మధ్య కూర్చొని చూస్తే బాగా ఎంజారు చేస్తారు’ అని అన్నారు.
హీరో చేతన్ కష్ణ మాట్లాడుతూ – మా ”ధూం ధాం” సినిమాకు ప్రేక్షకుల దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. మీడియా నుంచి కూడా చాలా మంచి రివ్యూస్ వచ్చాయి. సినిమా చాలా బాగుందంటే తప్ప ఆడియెన్స్ బయటకు రాని ఈ ట్రెండ్ లో మా మూవీకి 70, 80 పర్సెంట్ హౌస్ ఫుల్స్ కావడం సంతోషంగా ఉంది. సినిమాలో కంప్లీట్ ఎంటర్ టైన్ మెంట్ ఉంటుందని మేము ముందునుంచీ చెబుతూ వస్తున్నాం. ఆ ఎంటర్ టైన్ మెంట్ కే ఆడియెన్స్ కనెక్ట్ అవుతున్నారు. సినిమా చూసి తమ రెస్పాన్స్ చెబుతున్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. చూడని వాళ్లు థియేటర్స్ లో చూడమని రిక్వెస్ట్ చేస్తున్నా’ అని చెప్పారు