నవతెలంగాణ నవాబుపేట: మండల పరిధిలోని కొల్లూరు గ్రామంలో కేపీఎల్ టోర్నమెంట్ ఐదవ రోజు కొనసాగుతున్న సందర్భంగా కేపీఎల్ ఆర్గనైజేషన్ మంగళవారం టాస్ వేసి గేమ్ ను ప్రారంభించారు మొదటి ఇన్నింగ్స్ రోలింగ్ లయన్స్ 104/7 పరుగులు చేసింది రెండో ఇన్నింగ్స్ లో సూపర్ స్టైకర్స్105/9 పరుగులు చేసి రోలింగ్ లయన్స్ పై సూపర్ స్టిక్కర్స్ ఘనవిజయాన్ని సాధించారు. ఈ టోర్నీకి కొల్లూరు గ్రామానికి చెందిన వాసు యాదవ్, రామకృష్ణ యాదవ్ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. యువత క్రీడల లో రాణించాలని మానసిక శారీరక దృఢత్వం పెంపొందించుకోవచ్చని తెలిపారు ఈ సందర్భంగా కేపీఎల్ టోర్నీ ఏర్పాటుచేసిన ఆర్గనైజర్లను గ్రామస్తులుఅభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సౌజన్య రఘు గుప్త, జిల్లా అధ్యక్షులు వాసు యాదవ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తులసి రామ్ నాయక్, లక్ష్మీనరసింహారాజు, మాజీ ఉపసర్పంచ్ నరసింహ చారి, మార్కెట్ డైరెక్టర్ నాగ అంజయ్య, బి రఘు గౌడ్, బాల్ రెడ్డి, కోట్ల గోపాల్, లంబ వెంకటయ్య, రామ్మోహన్ రెడ్డి, సేవియా నాయక్, కంకంటి కృష్ణయ్య, ఎల్ ఎన్ స్వామి, కృష్ణయ్య, వడ్ల మహేష్, బంటు లక్ష్మయ్య, గ్రామ యువకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.