భువనగిరి నియోజకవర్గం సీపీఐ(ఎం) అభ్యర్థిగా కొండమడుగు నరసింహను ఆదరించండి

– చెరుపల్లి సీతారాములు (సీపీఎం మాజీ ఎమ్మెల్సీ, కేంద్ర కమిటీ సభ్యులు)
నవతెలంగాణ- భువనగిరి
భువనగిరి నియోజకవర్గం సీపీఎం పార్టీ అభ్యర్థిగా కొండమడుగు నరసింహను నియోజకవర్గ ప్రజలు ఆదరించాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు అన్నారు. ఆదివారం స్థానిక సుందరయ్య భవనంలో రాష్ట్ర కమిటి సభ్యులు బట్టుపల్లి అనురాధ అధ్యక్షతన సిపిఎం భువనగిరి నియోజకవర్గం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. నిత్యం ప్రజా సమస్యల కోసం పోరాటం చేసే ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్న సిపిఎం అభ్యర్థి కొండమడుగు నరసింహను భువనగిరి నియోజకవర్గ ప్రజలు ఆదరించాలని, ప్రజా ఉద్యమాలను ప్రజల గొంతుకను శాసనసభలలో వినిపించేందుకు నరసింహకు అమూల్యమైన ఓటు వేయాలని వారు కోరారు. భువనగిరి నియోజకవర్గంలో నిరంతరం ప్రజా సమస్యలపై పని చేసే సీపీఎం పార్టీకే ఓటు అడిగే నైతిక హక్కు ఉందని ప్రజలు సిపిఎం పోరాటాలను బలపరిచే విధంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని వారు కోరారు. ఊహ తెలిసినప్పటినుండి నరసింహ విద్యార్థి, యువజన, కళాకారుల మరియు వ్యవసాయ కూలీల సమస్యల మీద అనేక పోరాటాలు చేసిన అనుభవం కలిగిన వ్యక్తిగా నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారమే తన ఎజెండాగా పెట్టుకొని పనిచేస్తున్న నరసింహను ప్రజలు ఆదరించాలని, భూనిర్వాసితులకు నష్టపరిహారం ఇప్పించడంలో, మూసి జల కాలుష్యాన్ని అరికట్టడంలో, జిల్లా సమగ్ర అభివృద్ధి సాధనకై అనేక పోరాటాలు నిర్వహించిన వ్యక్తిగా ప్రజల ముందుకు కొండమడుగు నరసింహును సీపీఎం అభ్యర్థిగా ముందుకు తీసుకొస్తున్నామని ప్రజలు ఆదరించాలని వారు కోరారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ మాట్లాడుతూ కొండమడుగు నరసింహ పేద బడుగు బలహీన వర్గాల సమస్యల ప్రతినిధిగా నిరంతరం ప్రజలలో ఉంటూ ప్రజల తలలో నాలుకగా మెలిగిన వ్యక్తిగా ప్రజల ముందుకు సీపీఎం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వస్తున్నాడని ప్రజలు వారిని ఆదరించి మీ అమూల్యమైన ఓటును వినియోగించుకొని సీపీఎం  సుత్తికొడవలి నక్షత్రం గుర్తు మీద ఓటు వేయాలని వారు పిలుపునిచ్చారు. వీరితోపాటు సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కల్లూరి మల్లేశం, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్, DYFI రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్, సీనియర్ నాయకులు గూడూరు అంజిరెడ్డి, నాయకులు సిర్పంగి స్వామి, మాయ కృష్ణ, దయ్యాల నర్సింహ, బొల్లు యాదగిరి, గడ్డం వెంకటేష్, బోలగాని జయరాములు, వనం రాజు, ఈర్లపల్లి ముత్యాలు, బోడ భాగ్య, సందేల రాజేష్, అన్నంపట్ల కృష్ణ, గాడి శ్రీనివాస్, నాయకులు బండారు శ్రీరాములు, కళ్లెం సుదర్శన రెడ్డి, గుండు నర్సింహ, గూడూరు బుచ్చిరెడ్డి, కొండ అశోక్, గందమల్ల మాతయ్య, కల్లూరి నాగమణి, లలిత, కొండమడుగు నాగమణి, మంచాల మధు, రాంచంద్రం, sd ఉమర్,కోట రామచంద్రారెడ్డి, బర్ల వెంకటేష్, కవుడే సురేష్ పలేర్ల అంజయ్య, కుకూట్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.