ఏవైయు సొసైటీ జిల్లా ఉపాధ్యక్షుడుగా సురేందర్

నవతెలంగాణ- మల్హర్ రావు
అల్ ఎంప్లాయిస్ వెల్పేర్ సొసైటీ రిజిస్ట్రేషన్ 542 కాళేశ్వరం జోనల్  ఐదు జిల్లాల యువశక్తి అధ్యక్షుడు  చింతల కుమార్ యాదవ్, ఉపాధ్యక్షుడుగా బండి సుధాకర్ సూచన మేరకు ఏవైయు భూపాలపల్లి జిల్లా ఉపాధ్యక్షుడుగా మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామానికి చెందిన కేశారపు సురేందర్ ను ఏకగ్రీవంగా నియామకం చేసినట్లుగా అల్ ఎంప్లాయిస్ వెల్పేర్ సొసైటీ వ్యవస్థాపక,రాష్ట్ర అధ్యక్షులు లింగమల్ల శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం నియామక పత్రాన్ని అందజేశారు.తమపై నమ్మకంతో ఈ పదవిని అప్పజెప్పిన రాష్ట్ర అధ్యక్షుడు లింగమల్ల శంకర్,కాళేశ్వరం జోనల్ నాయకులు కుమార్ యాదవ్, బండి సుధాకర్ లకు సురేందర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ బాధ్యతపై అల్ ఎంప్లాయిస్ వెల్పేర్ సొసైటీకి మంచి పేరు తీసుకవస్తామని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏడబ్ల్యుయు మహిళ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు కొండ రాజమ్మ,కాటారం సబ్ డివిజన్ అధ్యక్షురాలు కొండూరి మమత, మండల అధ్యక్షురాలు ఏనుగు నాగరాని పాల్గొన్నారు.