తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా బోనాలు

– మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌
– ఆషాడ బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమావేశం
నవతెలంగాణ-బేగంపేట్‌
తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పే ఆషాడ బోనాల ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్ర మల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వెల్లడించారు. శుక్రవారం బేగంపేట లోని హరిత ప్లాజా లో జూన్‌ 2 వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఆషాడ బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి శ్రీనివాస్‌ యాదవ్‌ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర కరణ్‌ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాల పండుగను సీఎం కేసీఆర్‌ రాష్ట్ర పండుగగా ప్రకటించారని, ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంతో గొప్పగా నిర్వహిస్తూ వస్తున్నామని తెలిపారు. ఈ సంవత్సరం జూన్‌ 22 నుంచి ప్రారంభం కానున్న బోనాల ఉత్స వాల నిర్వహణ కోసం రూ. 15 కోట్లను ప్రభుత్వం కేటాయిం చిందని చెప్పారు. 22న గోల్కొండలో బోనాలు ప్రారంభం అవుతా యని, జులై 9న సికింద్రాబాద్‌ మహంకాళి బోనాలు, 16వ తేదీన ఓల్డ్‌ సిటీ బోనాలు జరుగుతాయని వివరించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ సంవత్సరం కూడా బోనాల ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులకు గురికా కుండా ఏర్పాట్లు చేస్తామని వివరించారు. బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలనే ఆలోచనతో అనేక ప్రయివేటు దేవాల యాలకు ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందిస్తుందని, తెలిపారు. ఈ విధంగా దేశంలో ఎక్కడా ఏ ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందిం చడం లేదని తెలిపారు. బోనాల సందర్బంగా వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్ల కోసం సుమారు రూ. 200 కోట్లను ఖర్చు చేయనున్నట్లు వివరించారు. విద్యుత్‌ సరఫరా లో అంతరా యం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఆలయాల పరిసరాలలో పారిశుధ్య నిర్వహణ కోసం జీహెచ్‌ఎంసీ అదనపు పారిశుధ్య సిబ్బందిని నియమించనున్నట్టు తెలిపారు. ఊరేగింపు నిర్వహించే రహదారులు, ఆలయాలకు వెళ్ళే రహదారులలో అవసరమైన మరమ్మతులు, అభివద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భక్తులకు తాగునీటి సౌకర్యం కల్పిస్తామన్నారు. శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం ఇతర జిల్లాల నుంచి అదనపు పోలీసు సిబ్బందిని నియమించడం జరుగుతుందని, అవసరమైన ప్రాంతాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. అలాగే మఫ్టీ పోలీసులు, షీ టీం లను బందోబస్తు విధుల కోసం నియమించనున్నట్టు పేర్కొన్నారు. వివిధ దేవాలయాల భక్తులకు స్వచ్చందంగా సేవలు అందించే వాలంటీర్లకు ప్రత్యేక గుర్తింపు కార్డులను అందజేస్తామని తెలిపారు. స్వచ్చందంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక హెల్త్‌ క్యాంప్‌లను ఏర్పాటు చేయడంతో పాటు అంబులెన్స్‌ లను కూడా అందుబాటులో ఉంచుతామని అన్నారు.
బోనాల ఉత్సవాల సందర్బంగా గోల్కొండ లోని శ్రీ జగదాం బిక ఆలయంలో, సికింద్రాబాద్‌ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి, ఓల్డ్‌ సిటీ లోని శ్రీ అక్కన్న మాదన్న తదితర 26 దేవాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను సమర్పించ నున్నట్టు మంత్రి చెప్పారు. ఉజ్జయిని మహంకాళి, అక్కన్న మాదన్న, సబ్జిమండి ఆల యాలకు అంబారీ ఊరేగింపు కోసం ఏనుగును ప్రభుత్వమే ఏర్పా టు చేస్తున్నట్టు తెలిపారు. పలు ప్రముఖ ఆలయా ల వద్ద సాంస్కృ తిక కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. దేవాదా య శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి మాట్లా డుతూ గత ప్రభుత్వాలు బోనాల పండుగ సరిగా జరపలేదని, తెలంగాణా ప్రభుత్వం వచ్చాకే అన్ని ఏర్పాట్లు చేస్తూ వస్తున్నదని అన్నారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్‌, మేయర్‌ విజయలక్ష్మి, ఎమ్మెల్సీలు ప్రభాకర్‌ రావు, సురబి వాణిదేవి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, ముఠా గోపాల్‌, కాలేరు వెంకటేష్‌, అరికేపూడి గాంధీ, వాటర్‌ వర్క్స్‌ ఎండీ దాన కిషోర్‌, దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌, హైదరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనర్‌లు సీవీ ఆనంద్‌, చౌహాన్‌, ట్రాన్స్‌ కో డైరెక్టర్‌ శ్రీనివాస్‌ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, వివిధ ఆలయాల కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.