దేశంలో తెలంగాణది సంక్షేమ స్వర్ణ యుగం

– పేదలకు ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యాన్ని ఇచ్చిండు కేసీఆర్
– రైతులకు దొంగరాత్రి కరెంటు ఇచ్చిన ఘనత కాంగ్రెసుది
– కరువుకు నెలవైన హుస్నాబాద్ నేడు సస్యశ్యామలం
– రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
దేశంలో సంక్షేమ పథకాల పేరిట ప్రతి సంవత్సరం పేదల సంక్షేమం కోసం రూ. 50000 కోట్లు ఖర్చు పెడుతున్నా తెలంగాణ రాష్ట్రం సంక్షేమ పథకాల అమలులో స్వర్ణ యుగమని రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. శుక్రవారం హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో తెలంగాణ అవతరణ దినోత్సవ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గ సంక్షేమ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ఒకప్పుడు కరువుకు నేలవైన హుస్నాబాద్ ప్రాజెక్టుల నిర్మాణాలతో సస్యశ్యామలంగా మారిందన్నారు. దేవుని దయ వల్ల గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తయిందనీ, రేపో, ఎల్లుండో కటక ఒత్తుడే నీళ్ళు పోసుడేనని చెప్పారు. అన్ని పండుగలు కలిసొస్తే ఎంత గొప్పగా ఉంటదో అంతటి పండుగను మనం గౌరవెల్లి ప్రాజెక్టు ప్రారంభోత్సవం రోజు జరుపుకుందాంమాన్నరు. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు స్పెషల్ ప్యాకేజ్ ఇస్తున్నామని, 185 మంది ఎస్టీ సోదర నిర్వాసితులకు ఒక్కరికి 8 లక్షల పరిహారం ఇవ్వడం జరిగిందన్నారు. పరిహారంతో పాటు ఇంటి జాగాని కూడా అందిస్తున్నమని అన్నారు. భారత దేశంలో ఏ రాష్ట్రంలో నిర్వాసితులకు ఇంత పెద్ద ఎత్తున ప్యాకేజీ ఇవ్వలేదన్నారు.తెలుగుదేశం ప్రభుత్వంలో ఊర్లో ఒక 30 మంది 40 మందికి రూ.75 రూపాయలు పెన్షన్ ఇచ్చేవారని, ఎవరికైనా కొత్త పెన్షన్ రావాలంటే ఎవరైనా చస్తే గాని వచ్చే పరిస్థితి ఉండేది కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 29 లక్షల మందికి రూ.200 రూపాయల పెన్షన్ ఇస్తే, బిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం 44 లక్షల మందికి రూ.2,000 పెన్షన్ ఇస్తున్న ఘనత మనదన్నారు. మహారాష్ట్ర నుండి 25 మంది సర్పంచులు సిద్దిపేటకు చూడ్డానికి వచ్చిరని, మహారాష్ట్రలో చెరువులను పట్టించుకునే నాధుడే లేడన్నారు. తాగడానికి నీళ్లు వారానికి ఒక రోజు ఇచ్చే పరిస్థితి మహారాష్ట్ర ప్రభుత్వానిదన్నారు. రైతులకు దొంగరాత్రి కరెంటు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది కాదా అని ప్రశ్నించారు. మహారాష్ట్రలో కెసిఆర్ కిట్టు, వ్యవసాయం కి 24 గంటల కరెంటు లేదు, 2000 పెన్షన్ రైతులకు రైతుబంధు లేదన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఆసరా పెన్షన్ల కోసం 53 వేల కోట్లు, రైతుబంధు పథకం కింద రూ. 65వేల కోట్లను రైతులకు నేరుగా ప్రభుత్వం ఇచ్చిందన్నారు.రూ.65 వేల కోట్లు ఖర్చు చేసి రైతులకు ఉచిత కరెంట్ అందించిన ఘనత కేసిఆర్ దేన్ననారు . ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి కింద లక్ష రూపాయలు సహాయం, రైతుబంధు రైతు బీమా ఇచ్చి రైతులకు రైతు బాంధవుడిగా కేసీఆర్ మారిందన్నారు. ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న బీఆర్ఎస్ పార్టీని, సతీష్ బాబును మీరందరూ ఆశీర్వదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిద్దిపేట్ జెడ్పీ చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణశర్మ , ఎమ్మెల్యే సతీష్ కుమార్ , జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ రాజారెడ్డి, మున్సిపల్ చైర్మన్ రజిత వెంకన్న, మార్కెట్ చైర్మన్ ఎడబోయిన రజిని, ఎంపీపీలు లకావత్ మానస సుభాష్ మాలోతు లక్ష్మీ బిల్లు నాయక్, జెడ్పిటిసి భూక్య మంగా స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.