దేశానికి అన్న పూర్ణగా తెలంగాణ రాష్ట్రం..

– దేశానికి అన్నం పెడుతున్న అన్న దాతలు మన తెలంగాణ రైతులు
– రైతు బంధు, రైతు భీమా రైతులకు ధీమా
– 24 గం.ల ఉచిత కరెంట్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
– ఉచిత కరెంటుకి దిష్టి పెడుతున్న కాంగ్రెస్ నాయకులు
– రైతుల ఉచిత కరెంట్ పై రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలకు నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే గణేష్ బిగాల 
నవతెలంగాణ- కంటేశ్వర్
రైతులకు 24 గం.లు ఉచిత కరెంట్ ఇవ్వకూడదని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 24 గం.ల ఉచిత విద్యుత్ రద్దు చేస్తామని మాట్లాడిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా వర్ని చౌరస్తా లోని పవర్ హౌస్ ఎదురుగా కాంగ్రెస్ పార్టీ, పిసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే గణేష్ బిగాల పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే  గణేష్ బిగాల మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం పచ్చగా ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు సహించలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ పిసిసి రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉన్నాయి.ఆయన తయారు చేసుకున్న సీక్రెట్ మ్యానిఫెస్టోని అమెరికాలో విడుదల చేశారు. అమెరికాలో కూర్చొని మాట్లాడితే తెలంగాణలో తెలవదు అనుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే సంక్షేమ పథకాలు 24 గంటల కరెంటు రద్దు చేసి మళ్ళీ పాత రోజులు తెస్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధి ఉండదు, సంక్షేమ పథకాలు ఉండవు, రైతుబంధు ఉండదు, 24 గంటల కరెంటు రద్దు చేస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 250 ఉన్న పింఛను 2000రూ. చేయడం జరిగింది. వికలాంగులకు 4000 రూ. పెంచడం జరిగింది. భారతదేశం అంతా తెలంగాణ వైపు చూస్తుందని అభివృద్ధి సంక్షేమంలో మొదటి స్థానంలో ఉంది. గతంలో చంద్రబాబు పాలనలో హైదరాబాదులో విద్యుత్ కోసం ధర్నా చేస్తే ఎన్కౌంటర్లు చేసిన ఘనత వాళ్లదైతే, భారతదేశ రాజధానిలో రైతులు ధర్నా చేస్తే ట్రాక్టర్లతో తొక్కించిన ఘనత బిజెపి ప్రభుత్వానిది. అన్నం పెట్టే రైతులకు దన్నుగా నిలవాలే తప్ప పొట్ట గొట్టే విధంగా మాట్లాడితే అడ్రస్ లేకుండాపోతారని ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను.ఈ నిరసన కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతు కిరణ్,నుడ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు సూదం రవి చందర్, సుజిత్ సింగ్ ఠాకూర్, సత్య ప్రకాష్,సిర్ప రాజు, యెనుగందుల మురళి బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, రైతు విభాగం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.