తెలంగాణ వేములవాడ సెకండ్ ఫైల్

చల్మెడను మర్యాదపూర్వకంగా కలిసిన చింతల్ ఠాణా గ్రామస్తులు..
నవతెలంగాణ – వేములవాడ
వేములవాడ అర్బన్ మండలం చింతల్ ఠాణా ఆర్ అండ్ ఆర్ కాలనీకి చెందిన సుమారు 100మంది ఎస్సి సంఘం సభ్యులు సోమవారం  బిఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి  చల్మెడ లక్ష్మీ నరసింహా రావును నివాసంలో  మర్యాదపూర్వకంగా కలిసి పలు విషయాలపై చర్చించారు. ముఖ్యంగా కాలనీలో ఎస్సి కుల సంఘ భవనం పెండింగ్ లో ఉందని, ఇంకా కొన్ని సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని సంఘం సభ్యులు  చల్మెడ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన చల్మెడ  మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిచిన వెంటనే అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
*చల్మెడకు మద్దతు తెలిపిన పలు  కుల సంఘాల సభ్యులు*
 అసెంబ్లీ ఎన్నికల్లో తమ సంపూర్ణ మద్దతు వేములవాడ నియోజకవర్గ బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావుకే ఉంటుందని  చందుర్తి మండలం ఎన్గల్ గ్రామ గౌడ సంఘం సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. సోమవారం వేములవాడ పట్టణంలోని చల్మెడ నివాసంలో ఆయన్ను కలిసిన సంఘం సభ్యులు ఈ మేరకు తీర్మానం చేశారు. అట్లాగే  కోనరావుపేట మండలానికి చెందిన వడ్డెర సంఘం సభ్యులు పలువురు బి.ఆర్.ఎస్ పార్టీలో చేరి, చల్మెడకు మద్దతు తెలుపుతామంటూ హామీ ఇచ్చారు. కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు అంబటి చంద్ర మౌళి, ఉపాధ్యక్షుడు బొయిని శ్రీనివాస్ లు చల్మెడ సమక్షంలో బి.ఆర్.ఎస్ పార్టీలో చేరి,  రాబోయే ఎన్నికల్లో తమ సంపూర్ణ మద్దతు లక్ష్మీ నరసింహా రావుకే ఉంటుందని స్పష్టం చేశారు.
    ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ అరుణ-రాఘవ రెడ్డి,సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి,  కోనరావుపేట మండల యువజన విభాగం అధ్యక్షుడు జీవన్ గౌడ్, ఎన్గల్ గ్రామ సర్పంచ్ లింగంపల్లి సత్తయ్య, సర్పంచ్ రేగులపాటి ఉమా రాణి, వైస్ ఎంపీపీ రవి చందర్ రావు, సత్తయ్య, ఉప సర్పంచ్ పులి మంజుల-మనోహర్,  సెస్ డైరెక్టర్ హరి చరణ్ రావు, నాయకులు బూర బాబు ,ఒడ్డెర సంఘం నాయకులు లక్ష్మణ్, శివరాత్రి దేవయ్య, వంశీకృష్ణ, అంజి, రవి తదితరులు పాల్గొన్నారు.