వినోద రంగంలో విప్లవాత్మక మార్పుల్ని తీసుకువచ్చేందుకు మరో కొత్త ఓటీటీ రాబోతోంది. బెంగళూరు బేస్డ్గా ఈ కొత్త ఓటీటీ సంస్థ ‘గ్లోపిక్స్’ కార్యకలాపాలు సాగించనుంది. గురువారం గ్లోపిక్స్ లోగోను అధికారికంగా లాంచ్ చేశారు. వేసవిలో పూర్తి స్థాయిలో ఈ సంస్థ అందుబాటులోకి రానుంది. గ్లోపిక్స్ను విన్సే ఎల్ ఏ, అనిత సంయుక్తంగా స్థాపించగా, లోకేష్ సన్నయ్య ఫౌండర్ మెంబర్, సిఎమ్ఓ ఫౌండింగ్ మెంబర్గా వ్యవహరిస్తున్నారు. మారుతి రాజీవ్ ఫౌండర్ మెంబర్/సిటిఓ, రూపేశ్ మామిళ్లపల్లి హైదరాబాద్ కంటెంట్ హెడ్గా వ్యవహరించనున్నారు. గురువారం ఈ లోగోను బెంగళూరు, కొచ్చి, హైదరాబాద్ వంటి ప్రదేశాల్లో ఘనంగా లాంచ్ చేసారు. ఇక ఈ ఫ్లాట్ ఫాంలో ఆసక్తికరమైన చిత్రాలు, వెబ్ సిరీస్లు, డాక్యుమెంటరీలు, రియాల్టీ షోలు అంటూ 360 డిగ్రీల ఎంటర్టైన్మెంట్ను అందించబోతున్నారు. గ్లోపిక్స్ ఫౌండర్ మెంబర్ మారుతి రాజీవ్ మాట్లాడుతూ, ‘మా గ్లోపిక్స్ లోగోను లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. మన కల్చర్, మన సంస్కతి, మన మూలాల్లోంచి కథలను గ్లోబల్గా అందించేందుకు దీన్ని ప్రారంభిస్తున్నాం. మంచి కంటెంట్, కాన్సెప్ట్లను అందించేందుకు ఈ కొత్త ఫ్లాట్ ఫాంను తీసుకొస్తున్నాం’ అని చెప్పారు. ‘ప్రాంతీయతను చాటేలా, లోకల్ టాలెంట్, కల్చర్ను ఎంకరేజ్ చేసేందుకు గ్లోపిక్స్ను స్టార్ట్ చేస్తున్నాం’ అని ఫౌండింగ్ మెంబర్ లోకేష్, హైదరాబాద్ కంటెంట్ హెడ్ రూపేశ్ తెలిపారు.