ఆ జయంలా పెద్ద హిట్‌ ఖాయం

ఆ జయంలా పెద్ద హిట్‌ ఖాయంస్రవంతి సినిమా పతాకంపై కంటూరు రవికుమార్‌ చౌదరి నిర్మాతగా, జి. కిరణ్‌కుమార్‌ దర్శకత్వంలో సత్య మేరుగు, దీపిక జంటగా రూపొందిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘జయం’. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ పోస్టర్‌లాంచ్‌ ఈవెంట్‌ను నిర్వహిం చింది. ఫిల్మ్‌ ఛాంబర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్‌, పీపుల్స్‌ మీడియా ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ శ్రీధర్‌, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణలు ముఖ్య అతిథిలుగా హాజరై ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రవికుమార్‌ చౌదరి మాట్లాడుతూ,’ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులకు థ్యాంక్స్‌. దర్శకుడు ఈ కథ చెప్పినప్పుడు ఆ ‘జయం’లాగే ఈ ‘జయం’ కూడా అంతే సక్సెస్‌ అవుతుందనిపించింది. మంచి విజన్‌ ఉన్న దర్శకుడు కిరణ్‌కుమార్‌. నేను ఇప్పటికే 4 సినిమాలను నిర్మించాను. వాటి ద్వారా 10 మంది హీరోలను పరిచయం చేశాను. ఈ సినిమా అందరికీ పేరు తెచ్చిపెడుతుందనే నమ్మకం ఉంది’ అని అన్నారు. ‘మంచి కథకు మంచి నటులు, టెక్నీషియన్స్‌ దొరికారు. టైటిల్‌ ఎంత బాగుంటుందో.. సినిమా కూడా అంతే బాగుంటుంది. మంచి లవ్‌, యాక్షన్‌ని వినోదంతో మిక్స్‌ చేశాం. అందరికీ నచ్చే సినిమా అవుతుంది’ అని దర్శకుడు కిరణ్‌కుమార్‌ చెప్పారు. ‘నిర్మాత రవికుమార్‌ చౌదరి ఇంతకు ముందే 4 సినిమాలు తీసి ఉండటంతో ఆయనకు మంచి అనుభవం ఉందని భావిస్తున్నాను. ‘జయం’ అనే టైటిల్‌ ఈ సినిమాకు మంచి ప్లస్‌ పాయింట్‌ అవుతుంది. తప్పకుండా ప్రేక్షకుల మన్ననలు పొందుతుంది’ అని తుమ్మలపల్లి రామసత్యనారాయణ చెప్పారు. పీపుల్స్‌మీడియా ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత శ్రీధర్‌ మాట్లాడుతూ,’నిర్మాత చౌదరితో నాకు ముందు నుంచీ పరిచయం ఉంది. మంచి అభిరుచిగల నిర్మాత. ఈ సినిమాకు మంచి కాస్టింగ్‌, టెక్నీషియన్స్‌ను ఎంచుకున్నారు. తేజ జయం చిత్రం లాగే ఈ జయం కూడా అద్భుత విజయం సాధించాలని కోరుకుంటున్నా. నాకు చేతనైన సాయం చేస్తాను’ అని తెలిపారు. ‘స్రవంతి బ్యానర్‌ ద్వారా రవికిషోర్‌ చాలాపెద్ద ప్రొడ్యూసర్‌గా ఎదిగారు. ఇప్పుడు ఈ స్రవంతి సినిమా ద్వారా ఈ చిత్ర నిర్మాత రవికుమార్‌ చౌదరి కూడా పెద్ద నిర్మాతగా ఎదగాలని కోరుకుంటున్నా. గ గతంలో తేజ చేసిన జయం ద్వారా ఎంతోమందికి లైఫ్‌ వచ్చింది. ఈ సినిమాతో కూడా కొందరు కొత్త వారికి లైఫ్‌ వస్తుందని ఆశిస్తున్నా. చిన్న సినిమాలకు మా ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుంది’ అని నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్‌ చెప్పారు. న