
– 3వ రోజు మోకాళ్లపై నిలబడి వినూత్న నిరసన తెలిపిన హమాలీ కార్మికులు
నవతెలంగాణ-భువనగిరి : సివిల్ సప్లయి హమాలీ కార్మికుల నిరవధిక సమ్మె పట్ల అధికారులు మొండి వైఖరి వీడనాడాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ అన్నారు. శుక్రవారం రోజున సివిల్ సప్లయి హమాలీస్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో పెంచిన కూలి రేట్ల జి.ఓ ను విడుదల చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న నిరవధిక సమ్మె 3వ రోజు యధావిధిగా కొనసాగింది. ఈ సందర్బంగా 3వ రోజు భువనగిరి గోడౌన్ వద్ద హమాలీలు మోకాలపై నిలబడి వినూత్న రితిలో ప్రభుత్వానికి తమ నిరసన తెలిపారు. ఈ సందర్బంగా ఇమ్రాన్ మాట్లాడుతూ పెంచిన కూలి రెట్ల జీవో విడుదల చేయాలని కార్పొరేషన్ రాష్ట్ర కమిషనర్ కి, సంబంధిత అధికారులకు డిసెంబర్ 18న సమ్మె నోటీస్ ఇచ్చిన నేటికీ స్పందించలేదన్నారు. హాస్టళ్లకు మరియు స్కూళ్లకు బియ్యం వేయాలని సాకుతో అధికారులు సమ్మెను విచ్చిన్నం చేయాలని చూస్తూ హమాలీ కార్మికులపై ఒత్తిడి చేస్తున్నారని ఇది సరైన పద్ధతి కాదని అయన అన్నారు. గత 3 నెలల క్రితం సివిల్ సప్లయి కమిషనర్ సమీక్షంలో జరిగిన చర్చలకు సంబంధించిన జీవో కాపీ విడుదల చేసే వరకు సమ్మె యధావిధిగా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు, సివిల్ సప్లయి హమాలి యూనియన్ భువనగిరి పాయింట్ అధ్యక్షులు గౌరవంతుల శ్రీనివాస్, నాయకులు ముదిగొండ బస్వయ్య, పిన్నం జగన్, ముడుగుల స్వామి, మామిండ్ల సత్యనారాయణ, బొజ్జ గణేష్, చంద్రయ్య, పాండరి, కిష్టయ్య, పరశురాములు, రాజు, స్వామి, నర్సింహా, నరేష్, స్వీపర్లు శాంతమ్మ, అంజమ్మ, శారద, శోభ పాల్గొన్నారు.