అయోధ్య నుండి మన భాగ్యనగరం చేరుకుంటున్న శ్రీరామ అక్షింతలు

నవతెలంగాణ -సుల్తాన్ బజార్ 
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు-తెలంగాణ ఆధ్వర్యంలో శనివారం కొఠి విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో  విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి శాలివాహన పండరినాథ్ , సహకార్యదర్శి  రాజేశ్వర్ రెడ్డి, బజరంగ్ దళ్ తెలంగాణ ప్రాంత కన్వీనర్ యు. శివరాములు, ప్రాంత సత్సంగ్ సహప్రముఖ్  రాంరెడ్డి  మాట్లాడుతూ.. నవంబర్ 6 తేది న అయోధ్య నుండి శ్రీరామ అక్షింతలు శంషాబాద్ విమనాశ్రయానికి చేరుకోవడం జరుగుతుందని చెప్పారు. అక్కడి నుండి తుక్కుగూడ మీదుగా శోభాయాత్రగా బయలుదేరి కర్మాన్ గట్ట్ హనుమాన్ దేవాలయనికి చేరుకుంటాయి తెలిపారు. అయోధ్య నుండి మన భాగ్యనగరానికి చేరుకుంటున్న శ్రీరామ అక్షింతలను యువకులంతా స్వాగతం పలికి శంషాబాద్ విమానాశ్రయం నుండి కర్మాన్ ఘాట్ హనుమాన్ దేవాలయం వరకు జరిగే శోబాయత్రలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.