నవతెలంగాణ: మలహర్రావు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మలహర్రావు మండలం కొయ్యురు ప్రెస్ క్లబ్ లో బీసీ కుల సంఘాల సమావేశం నిర్వహించగా ముఖ్య అతిథిగా వచ్చిన భూపాలపల్లి జాతీయబీసీ సంఘం జిల్లా ఇన్చార్జి విజయగిరి సమ్మయ్య మాట్లాడుతూ బీసీ సీఎం ప్రకటించినందుకు ప్రధాన మంత్రికి కృతజ్ఞతలు మంథని నియోజకవర్గంలో జనరల్ సీట్లో మున్నూరు కాపు బీసీ బిడ్డ పుట్ట మధుకర్ గారి కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.మా వాటా మాకు కావాలి తెలంగాణ రాష్ట్రంలో 56% ఉన్న బీసీ జనాభాకు రాజకీయపరంగా చట్టసభలో బీసీ రిజర్వేషన్లు లేవు ఉద్యోగ పరంగా విద్యాపరంగా చాలా వెనుక పడ్డ తెలంగాణ బీసీ ప్రజలారాఆలోచన చేయండి, మేల్కోండి ఓటు మనమే సీటు మనదే రాజ్యాధికారం మనదే రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీ బిడ్డలను గెలిపించుకోవాలి అసెంబ్లీకి పంపాలి మన వాటా శాతం గురించి కొట్లాడుతారు చట్టసభలో రిజర్వేషన్ మాట్లాడతారు. మంథనినియోజవర్గంలో బీసీ ప్రజలు ఆలోచన చేయండి ఇప్పటివరకు మంథని నియో వర్గంలో 65 సంవత్సరాలు అగ్ర నాయకులు పరిపాలించారు ఒక్కసారే బిసి బిడ్డ గెలిచాడు. మన ప్రాంతం అభివృద్ధి జరగాలంటే మంథనిబీసీ ప్రజలు గమనించండిజనాభా 56% ఉన్నది ప్రజలారా ఆలోచన చేయండి మున్నూరు కాపుబీసీ బిడ్డ పుట్ట మధుకర్ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు మన ఓటు మన సీటు మనకు రాజ్యాధికారం రావాలంటే అమూల్యమైన ఓటేసి అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించాలి మండల బీసీ సంఘాలు పూర్తి మద్దతు బీసీల ఐక్యత వర్ధిల్లాలి బీసీల రాజ్యాధికారం రావాలి ఈ కార్యక్రమంలో మండల బీసీ సంఘం నాయకులు అను పెద్ది రాంబాబు,దెంచినాలతిరుపతి, తిరుపతి, చల్ల కుమారస్వామి, కోట సురేష్ గౌడ్, కొడాలిబాపు సమ్మయ్య,డబ్బేంకి మొండయ్య ఓజాల చంద్ర చారి, ఓదెల బ్రహ్మచారి, తంగళ్ళపల్లి ప్రకాచారి, రమణ చారి, సంపత్, రాజమౌళి, రాజు, శ్రీనివాస్ చారి, కేశవ్, మధు, తదితరులు పాల్గొన్నారు
వచ్చే పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలి
10:23 pm