
నవతెలంగాణ -డిచ్ పల్లి
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్ పల్లి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన చెందిన ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూ రైన చెక్కులను బాధితులకు ఆదివారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, జిల్లా యువ నాయకులు, జిల్లా ఒలంపిక్ ఉపాధ్యక్షులు, ధర్పల్లి జడ్పిటిసి బాజిరెడ్డి జగన్మోహన్ లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ సీఎం సహాయనిధి కింద అందించే సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఆపద సమయాల్లో వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిది ఆపద్భందులగా ఆదుకుంటుంన్నా సీఎం కేసీఆర్ అని, రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం విషయంలో పూర్తి భరోసా కల్పిస్తుందన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి కింద చికిత్సకు తగిన ఆర్థిక సాయం బాధితులకు అందిస్తోందని వివరించారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇప్పటివరకు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 5,854 మంది లబ్ధిదారులకు 20.కోట్ల 35 లక్షలు లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబడుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి దాసరి ఇందిరా లక్ష్మీ నర్సయ్య, మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు సాయిల్, సీనియర్ నాయకులు, మాజీ మండల అధ్యక్షులు శక్కరి కోండ కృష్ణ, ఓడ్డేం నర్సయ్య, వివిధ గ్రామాల సర్పంచులు నర్సయ్య, జగదిష్, మోహమ్మద్ యూసఫ్, సర్పంచులు, ఎంపిటిసిలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.