లోక్ సభ ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలి: కలెక్టర్

నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
జిల్లాలో లోక్ సభ ఎన్నికలు సమర్థవంతంగా  నిర్వహించేందుకు టీమ్స్ అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ సూచించారు.బుధవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో లోక్ సభ ఎన్నికలు 2024 సందర్బంగా కలెక్టరేట్ లోని అన్ని శాఖల సిబ్బంది కి ఎం సి సి, సి విజిల్, సువిధ, మ్యాన్ పవర్ మేనేజ్ మెంట్, మీడియా సెంటర్,ఈవీఎం మేనేజ్ మెంట్ తదితర అంశాలపై శిక్షణ ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సక్రమంగా విధులు నిర్వహించాలన్నారు. ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా లో వచ్చే ప్రకటనలకు ముందస్తు అనుమతి తీసుకోవాలని సూచించారు. సి సెక్షన్ ద్వారా ఎప్పటికప్పుడు ఈ సి ఐ వారి అప్డేట్స్ అన్ని శాఖ లకు తెలపాలన్నారు. పోలింగ్ కేంద్రాలలో ర్యాంప్ లు, టాయిలెట్స్, కరెంట్, త్రాగునీరు లాంటి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు.సమస్యత్మాక పోలింగ్ కేంద్రాలలో మాక్ పోలింగ్, ఏజెంట్స్ చేసే పనులు, పోలింగ్ సరళి ని వెబ్ క్యాస్టింగ్ చేయాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ లో మూడు రకాలు ఉంటాయనిఫారం 12 ద్వారా ఎన్నికల సిబ్బంది ఫారం 12 బి ద్వారా 4 th క్లాస్ సిబ్బంది ( ఈ డిసి) ఫారం 12 డి ద్వారా 85 సంవత్సరాలు ఉన్న వయ్యో వృద్దులు, వికలాంగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు ఉపయోగించుకోవాలని తెలిపారు. ఎన్నికల ప్రకటన ప్రకటించిన రోజు నుండే ఎం సి సి అమలులో ఉంటుందని, సి విజిల్ ద్వారా వచ్చే పిర్యాదు లపై 15 నిమిషాలలో స్పందించి పిర్యాదు అందిన ప్రదేశం కు 5 నిమిషాలలో ఎఫ్ ఎస్ టి టీం వెళ్లాలని , ఎం సి సి కోడ్ ఉల్లాంఘన అయితే ఫారం బి8, అమౌంట్ సీజ్ విషయం అయితే ఫారం బి9 ద్వారా ద్వారా సమాచారం అందించాలని తెలిపారు.1950 కి కాల్ చేసి ఓటు కి సంబందించిన విషయాలు పౌరులు తెలుసుకోవచ్చు అని ,సువిధ యాప్  ద్వారా పోటీ చేసే అభ్యర్థుల వివరాలు తెలుసుకోవచ్చని ఈ సందర్బంగా తెలిపారు. ర్యాలీలు, రోడ్ షో లు, మీటింగ్ లలో డి జె సౌండ్స్ ఉపయోగించరాదనీ పాఠశాలలు,దేవాలయాలు, మసీదులు, చర్చిల సమీపంలో రాజకీయ పార్టీల కార్యాలయాలు ఏర్పాటు చేయకూడదని తెలిపారు.ఈ కార్యక్రమం లో ఎస్ ఎల్ ఎం టి లు విప్పర్ల రమేష్, సి హెచ్ శ్రీనివాస రావు, ఏవో సుదర్శన్ రెడ్డి, ఎన్నికల పరివేక్షకులు శ్రీనివాస రాజు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.