హాలియా మున్సిపాలిటీ లో అవిశ్వాసం నెగ్గిన కాంగ్రెస్ పార్టీ

– ఛైర్మన్,  వైస్ ఛైర్మన్ పీఠాలను కోల్పోయిన బీఆర్ఎస్  

నవతెలంగాణ – హాలియా
పురపాలక సంఘం చైర్మన్ వెంపటి పార్వతమ్మ, వైస్ చైర్మన్ నల్లగొండ సుధాకర్ లపై అవిశ్వాస తీర్మానం నెగ్గింది. హాలియా మున్సిపాలిటీలో మొత్తం కౌన్సిలర్లు 12 మంది ఉండగా  వీరిలో చైర్మన్, వైస్ చైర్మన్ గైర్హాజరు కాగా మిగతా 10 మంది కౌన్సిలర్లు అంతా అవిశ్వాసానికి మద్దతు పలికారు. దీంతో.. హాలియా”మున్సిపల్ చైర్ పర్సన్ వెంపటి పార్వతమ్మ, వైస్ చైర్మన్ నల్లగొండ సుధాకర్ లు. తమ పదవులను కోల్పోయారు. మిర్యాలగూడ ఆర్డీవో చెన్నయ్య ఆధ్వర్యంలో అవిశ్వాస పరీక్ష జరగ్గా నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి.ఎక్స్ అఫిషియో హోదాలో హాజరయ్యారు. నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని నందికొండ, హాలియా మున్సిపాలిటీలు కాంగ్రెస్ హస్తగతం అయ్యాయని.. వాటి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఏం యల్ ఏ  జైవీర్ రెడ్డి అన్నారు.