రైతు స్వరాజ్య వేదిక పోరాట ఫలితమే కోర్టు తీర్పు..

Court verdict is the result of struggle of Rythu Swarajya platform.నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
రైతు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షులు సంగెపు బొర్రన్న బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో, జిల్లాలో 2014 జూన్ 2 నుండి జరిగిన రైతు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు 194 జిఓ ప్రకారంగా రూ. 6 లక్షల నష్టపరిహారం ఇస్తామని చెప్పిన గత ప్రభుత్వం, 2014 నుండి 2021 వరకు దాదాపుగా  రాష్ట్రంలోనే 7వేలమంది రైతులు ఆత్మహత్య చేసుకోగా, ఆదిలాబాద్ జిల్లాలో 302 మంది,రైతు ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. 194 జిఓ ప్రకారంగా ఈ కుటుంబాలకు మాత్రమే నష్టపరిహారం అందించిందని పేర్కొన్నారు. నష్టపరిహారం ఇవ్వాలని కోరుతూ, రైతు స్వరాజ్య వేదిక, తరఫున 2021లో హైకోర్టులో ఫిల్ వేయడం జరిగింని 2023లో రైతు ఆత్మహత్య చేసుకున్న  అర్హులైన , కుటుంబాలకు నాలుగు నెలలలోపు 6 లక్షల రూ, నష్టపరిహారం ఇవ్వాలని హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ తీర్పులో భాగంగానే, రాష్ట్రంలో 141,రైతు, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు జిఓ నంబర్ 15 ప్రకారంగా  రూ.9,98,50,008ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని పేర్కొన్నారు.