– ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ప్రవేశాల గడువును వచ్చేనెల 15వ తేదీ వరకు ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, గురుకుల జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలను పొందాలని విద్యార్థులకు సూచించారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రయివేటు జూని యర్ కాలేజీల్లో చేరేందుకు ఆలస్య రుసుం రూ.500 చెల్లించాలని తెలిపారు. ప్రభుత్వ, ప్రభుత్వరంగ జూనియర్ కాలేజీలకు ఆలస్య రుసుం నుంచి మినహా యింపు ఉందని పేర్కొన్నారు. అనుబంధ గుర్తింపు ఉన్న జూనియర్ కాలేజీల్లోనే చేరాలని విద్యార్థులకు, చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. ఆ కాలేజీల జాబితాను aషaస్స్త్రbఱవ.షస్త్రస్త్ర.స్త్రశీఙ.ఱఅ , ్స్త్రbఱవ.షస్త్రస్త్ర.స్త్రశీఙ.ఱఅ వెబ్సైట్లో పొందుపర్చామని వివరించారు. గుర్తింపు లేని కాలేజీల్లో చేరొద్దని సూచించారు. విద్యార్థులకు ఇంటర్ ప్రథమ సంవత్సరంలో వచ్చేనెల 15వ తేదీ వరకు ప్రవేశాలను కల్పించాలని జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లను ఆమె ఆదేశించారు.