– రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
స్వరాష్ట్రంలోనే తండాలు అభివద్ధి చెందాయని, మారుమూల తండాలు సైతం ప్రగతిబాట పట్టాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి తెలిపారు.5,6 వార్డులలోని వస్త్రంతండాకు చెందిన కాంగ్రెస్,బీజేపీ లకు చెందిన 150 మంది శనివారం స్థానిక క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్లో చేరిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గిరిజనుల అభివద్ధికి కేసీఆర్ సర్కారు అనేక పథకాలు అమలు చేస్తున్నదని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివద్ధి కార్యక్రమాలు, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరడం అభినందనీయం అన్నారు.రామగిరి నగేష్, విజయ సక్రునాయక్ , శ్రీను నాయక్ల ఆధ్వర్యంలో ధనావత్ జోగ్యానాయక్, టీకం, లాలు, హరియారెడ్డి, కళ్యాణ్, రాము, శంకర్, ధరావత్ విజరు, నాగేంద్రబాబు, నాగు, కవితతో పాటు బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు.ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో కౌన్సిలర్లు లీలాలింగానాయక్, బాషామియా పాల్గొన్నారు.