నవతెలంగాణ- తాడ్వాయి
ఎస్పీ ఆఫీసు సమీపంలో గల ఈవీఎం గోడౌన్ ను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మంగళవారం సందర్శించారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్ లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను పరిశీలించారు. సిబ్బంది విధులు నిర్వహిస్తున్న తీరును , పోలీసు భద్రత ను , పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈవీఎంలు, బ్యాలెట్ యంత్రాల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు అనిల్ కుమార్,ఇందిర సంబంధిత ఉన్నారు.