ఆశా వర్కర్ల ఎగ్జామ్ వెంటనే రద్దు చేయాలి

– పారితోషికాలను రూ.18,000/-లకు పెంచాలి.
– సీఐటీయూ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేత
– సీఐటీయూ జిల్లా కోశాధికారి జి. భాస్కర్
నవతెలంగాణ – దుబ్బాక రూరల్
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఆశావర్కర్లకు ఎగ్జామ్ నిర్వహించి…. ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ ఇస్తాం, మిగతావారిని తొలగిస్తామనడం భావ్యం కాదని సీఐటీయూ జిల్లా కోశాధికారి జి. భాస్కర్ అన్నారు. వెంటనే ఎగ్జామ్ రద్దు చేయాలని కోరుతూ… సీఐటీయూ ఆధ్వర్యంలో మండలంలోని రామక్కపేట పీహెచ్సీ లో ఆశావర్కర్లతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కోశాధికారి జి. భాస్కర్ మాట్లాడుతు తెలంగాణ రాష్ట్రంలో ఆశా వర్కర్లు గత 32 సంవత్సరాల నుండి పని చేస్తూ… ఇప్పటి వరకు ప్రభుత్వం నిర్వహించిన అనేక ట్రైనింగ్ లలో శిక్షణా పొందారన్నారు. ఏళ్ల తరబడి సినియార్టీ ఉన్న ఆశా వర్కర్లకు కొత్తగా ఎగ్జామ్ నిర్వహిస్తామని నిర్ణయం తీసుకుంది.ఐతే ఈ ఎగ్జామ్ లో ఉత్తీర్ణత సాదిస్తేనే ఆశా వర్కర్స్ సర్టిఫికెట్ ఇస్తామని, ఫెయిల్ అయితే ఆశాలను విధుల నుండి తొలగిస్తామని ప్రభుత్వం చెప్పడం అన్యాయమన్నారు.ఇది ఆశాలను కించపరచడంతో పాటు ఆశాల సినియార్టీని తగ్గించి, ఉద్యోగ భద్రత లేకుండా చేయడం తప్ప మరొకటి కాదన్నారు.వెంటనే
ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రిజిస్టర్స్ రాయడం, సర్వేలు చేయించడం, ఆన్లైన్ పని చేయడం, బిపి, షుగర్స్, థైరాయిడ్ తదితర అన్నిరకాల జబ్బులను గుర్తిస్తూ… ప్రభుత్వం సప్లై చేస్తున్న మందులను ప్రజలకు అందజేస్తున్నా వారికీ నేడు కనీస వేతనాలు అమలు చేయకుండా ఆశాలను ఈ ప్రభుత్వం మోసం చేస్తుందని అన్నారు. డబ్ల్యుహెచ్ఓ ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ గ్లోబల్ లీడర్స్ అని ఆశా వర్కర్లకు అవార్డును ఇచ్చారని ఈసందర్భంగా గుర్తు చేశారు. ఆశ వర్కర్లకు పారితోషికాలు లేని అనేక ప్రభుత్వం పనులను ప్రతిరోజు ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు సబ్ సెంటర్స్, బస్తీ దవాఖానాల్లో పని చేస్తున్న ఆశాలకు కేవలం రూ.9,750/-లు పారితోషికాలు మాత్రమే ప్రభుత్వం చెల్లించడం అన్యాయం అన్నారు. మరొకవైపు నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ఆశాల పారితోషికాలను రూ.18,000/-లకు పెంచి ఫిక్సిడ్ వేతనం నిర్ణయించాలని, డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆషా వర్కర్స్ శ్యామల,సుజాత, దేవలక్ష్మి,వసంత,సుమమలత, కనకవ్వ, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.