సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గోట్’. దివ్యభారతి నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘పాగల్’ ఫేమ్ నరేష్ కుప్పిలి దర్శకుడు. మహాతేజ క్రియేషన్స్ పతాకంపై చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ నిర్మిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్లో ఈ చిత్రం తొలిషెడ్యూల్ను పూర్తిచేసుకుంది.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ,’ఇటీవల విడుదల చేసిన టైటిల్ ఫస్ట్లుక్కు మంచి స్పందన వచ్చింది. రీసెంట్గా కంప్లీట్ చేసిన షెడ్యూల్లో సుధీర్, హీరోయిన్ దివ్యభారతిలపై కొన్ని కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్ ఏపిసోడ్స్ను చిత్రీకరించాం. కాంప్రమైజ్ కాకుండా చాలా రిచ్గా తెరకెక్కిసున్నాం. టెక్నికల్గా ఉన్నత స్థాయిలో ఉంటుంది. సుడిగాలి సుధీర్ కెరీర్లో ఈ చిత్రం మైల్స్టోన్గా నిలుస్తుంది’ అని అన్నారు.