కొల్లాం : సుప్రీంకోర్టులో తొలి మహిళా జడ్జి, తమిళనాడు మాజీ గవర్నర్ ఎం. ఫాతిమా బీవి గురువారం మృతి చెందారు. ఆమె వయస్సు 96 ఏళ్లు. కేరళలోని కొల్లాంలో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఫాతిమా బీవి కన్నుమూశారు. జాతీయ మానవ హక్కుల కమిషన్లోనూ సభ్యులుగానూ ఆమె సేవలందించారు. కేరళలోని పథనంథిట్ట జిల్లాలో 1927లో ఫాతిమా బీవి జన్మించారు. ముందుగా రసాయన శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసినా తరువాత ఎల్ఎల్బి చదివారు. ఎల్ఎల్బిలో బంగారు పతకం అందుకున్న ఎనిమిదేళ్ల తరువాత మేజిస్ట్రేట్గా జాయిన్ అయ్యారు. 1974లో జిల్లా సెషన్స్ జడ్జిగానూ, 1983లో కేరళ హైకోర్టు జడ్జిగానూ నియమితులయ్యారు. 1989లో సుప్రీంకోర్టులో తొలి మహిళా జడ్జిగా నియమితులయ్యారు.