నవతెలంగాణ-హైదరాబాద్ : కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం శనివారం జరిగిన విషయం తెలిసిందే. రాజస్థాన్లోని జైసల్మేర్ జరిగిన ఈ మీటింగ్లో వివిధ వస్తువులు, ఉత్పత్తులపై జీఎస్టీ పెంపు, తగ్గింపుపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అనంతరం ధరలు పెరిగేవి, తగ్గే వాటి గురించి ఇక్కడ తెలుసుకోండి..
ధరలు పెరిగేవి:
పాత పెట్రోల్, డీజిల్ కార్లు, పాత ఎలక్ట్రిక్ వాహనాలు
రెడీ టు ఈట్ పాప్కార్న్
కార్పొరేట్ స్పాన్సర్షిప్ సేవలు
ఆటో క్లేవ్డ్ ఎరేటెడ్ కాంక్రీట్ బ్లాక్స్ లో 50 శాతం ఫ్లై యాష్ ఉంటే అధిక జీఎస్టీ
ధరలు తగ్గేవి:
ప్రజాపంపిణీకి ఉపయోగించే ఫోర్టిఫైడ్ రైస్
జన్యు చికిత్సలకు చేసే జీన్ థెరపీ
ఎండుద్రాక్ష, మిరియాలు