సీఎంను కలిసిన కొత్త ఎమ్మెల్సీలు, సలహాదారులు

ననవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కొత్తగా నియామకమైన ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్సీలు జూబ్లీహిల్స్‌ నివాసంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారులుగా నియామకమైన షబ్బీర్‌ అలీ, వేణుగోపాల్‌ రావు, వేం నరేందర్‌ రెడ్డి, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియామకమైన మల్లు రవి, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు మహేష్‌ కుమార్‌ గౌడ్‌, బల్మూరి వెంకట్‌ను ముఖ్యమంత్రి అభినందించారు.దావోస్‌ పర్యటనలో రాష్ట్రానికి రూ.40వేల కోట్లకు పైగా పెట్టుబడుల కోసం ఒప్పందాలు చేసుకోడంపై సీఎంకు వారంతా అభినందనలు తెలిపారు.