చిలకలప గట్టు తరలి వెళ్లిన వనదేవతలు

– ముగిసిన సమ్మక్క, సారక్క జాతర
– జాతరకు భారీగా భక్తులు
– భక్తి శ్రద్దలతో మొక్కులు
నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం నీమా నాయక్ తండా పంచాయతీ పరిధిలోని పొట్టిచెలిమ వద్ద వెలసిన గిరిజనుల ఆరాధ్య దైవాలుగా కొలుస్తున్న, సమ్మక్క సారక్క జాతరకు ఆదివారం చివరిరోజు చూడు చిలుకల గట్టు కు తరలి వెళ్లడం తో జాతర ముగిసింది. చివరి రోజు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు దీంతో ఆలయం ప్రాంగణం భక్తులతో నిండి పోయింది.ఉమ్మడి నల్గొండ,నియోజకవర్గం నుంచే గాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులు విశేషంగా దర్శించే సమ్మక్కజాతర కొండాకోనా పరవశించేలా సంభరాలు ముగిసాయి.భక్తులు వన దేవతలకు పసువు, కుంకుమ, లతో బెల్లం, బియ్యం సమర్పించి భక్తులు మొక్కులు చెల్లించు కున్నారు.ఈ జాతర ను ఆర్గనైజర్ గుంజా కృష్ణం రాజు, దేవాలయం అధ్యక్షులు నాగపురి లక్ష్మి రామస్వామి, బోర్డు ఆఫ్ ట్రస్ట్ నాగపురి వెంకట పతి,కమిటీ సభ్యులు వెంకట్ పతిరాజు, సాయి, సంభశివ, ప్రియ దర్శిని, విజయ, లహరి, నమిత,మహా లక్ష్మి వారి ఆధ్వర్యంలో ఘనంగా ఉత్సావాలు ముగిసాయి.