పారిశుధ్యం, మౌళిక సదుపాయాల కల్పన కే అధిక ప్రాధాన్యం

నవతెలంగాణ – అశ్వారావుపేట
పట్టణంలో పారిశుధ్యం,ప్రజలకు మౌళిక సదుపాయాలు కల్పించడానికి అధిక ప్రాధాన్యం ఇస్తాం అని నియోజక వర్గ,మండల కేంద్రం అయిన అశ్వారావుపేట మేజర్ పంచాయితీ ప్రత్యేక అధికారి డివిజనల్ పంచాయితీ అధికారి రాజీవ్ కుమార్ తెలిపారు.ఆయన శుక్రవారం ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం పంచాయితీ లోని హరిత హారం నర్సరీ,డంపింగ్ యార్డ్,బృహత్ పల్లె ప్రకృతి వనాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడారు.ఆయన వెంట ఎం.పి.ఒ సీతారామరాజు,ఇ.ఒ గజవల్లి హరిక్రిష్ణ ఉన్నారు.అనంతారం,గాండ్లగూడెం,మల్లాయిగూడెంలలో ఐటిడిఏ డివిజనల్ అధికారి రామిరెడ్డి, వేదాంతపురం,రామన్నగూడెం లో ఎఫ్.ఆర్.ఓ మురళీ, పేరాయిగూడెం,నారంవారిగూడెం కాలనీ లో తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్,వినాయకపురం,కొత్త మామిళ్ళ వారి గూడెం,ఊట్లపల్లి లో ఎం.పి.డి.ఒ శ్రీనివాసరావు, ఆసుపాక,నారాయణపురం,నారంవారిగూడెం లో ఎం.పి.ఒ సీతారామరాజు,గుర్రాల చెరువు,పాత అల్లి గూడెం లో డి టి రేనా సుచిత్ర,బచ్చు వారి గూడెం,గుమ్మడవల్లి,కోయ రంగాపురం లో వ్యవసాయ అధికారి వై.నవీన్, అచ్యుతాపురం,మద్దికొండ లో మిషన్ భగీరథ ఇంట్రా ఎ.ఇ లక్ష్మి, పాత రెడ్డిగూడెం,తిరుమలకుంట లో నీటిపారుదల శాఖ ఎ.ఇ కే.ఎన్.బి క్రిష్ణ, కన్నాయిగూడెం,కావడి గుండ్ల లో ఉద్యాన శాఖ మండల అధికారి సందీప్, జమ్మిగూడెం,కేసప్పగూడెం లో  నయాబ్ తహశీల్దార్ సి.హెచ్ రామక్రిష్ణ,మొద్దులు మడ,నందిపాడు,దిబ్బ గూడెం లో పశుసంవర్ధక శాఖ వైద్యురాలు స్వప్న ప్రత్యేక అధికారులుగా శుక్రవారం విధుల్లో చేరారు.