– మండల స్పెషల్ అధికారి,ఎంపిడిఓ
నవతెలంగాణ – మల్హర్ రావు
అవినీతి నిర్మూలనకు ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలని మండల స్పెషల్ అధికారి అవినాష్, మండల ఎంపిడిఓ నరసింహమూర్తి లు అన్నారు.మండల కేంద్రమైన తాడిచెర్ల మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో శుక్రవారం సమాచార హక్కు చట్టం రక్షణ వేదిక 2024 క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు సమాచార హక్కు చట్టం చట్టాన్ని ఆయుధంగా వినియోగించుకొని ప్రతి ఒక్కరూ అవినీతి నిర్మూలనకు నడుం బిగించాలని, పిలుపునిచ్చారు.అవినీతి అక్రమాలను ఎదుర్కొనేందుకు యువత, రైతులు, ప్రజలు సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకొని పేద ప్రజలకు న్యాయం చేసే విధంగా ముందుకు నడవాలని,ఈ చట్టాన్ని దుర్వినియోగం కాకుండా చూడవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు.సమాచార హక్కు రక్షణ చట్టం మండల అధ్యక్షుడు చింతల కుమార్ యాదవ్ మాట్లాడారు పాలనలో పారదర్శకత అధికారులు జవాబుదారితనం ఉండాలన్నారు,ఈ కార్యక్రమంలో ఆర్టీఐ మండల ఉపాధ్యక్షుడు చొప్పరి రాజయ్య, ప్రధాన కార్యదర్శి శేనిగల లక్ష్మన్,కార్యదర్శి బండి సుధాకర్,మండల పరిషత్ సూపర్ డెంట్ శ్రీరామమూర్తి,ఎంపిఓ విక్రమ్ కుమార్,ఉపాది హామీ పథకం ఏపీఓ హరీష్,జూనియర్ అసిస్టెంట్ ఆదిత్య చక్రవర్తి, ఉపాది ఆపరేటర్ ఇందారపు భవాని,టెక్నీకల్ అసిస్టెంట్ రమేష్ పాల్గొన్నారు.