-హుస్నాబాద్ ఏసిపి వాసాల సతీష్
నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్
ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు వజ్ర ఆయుధమని, ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని హుస్నాబాద్ ఏసిపి వాసాల సతీష్ అన్నారు. బుధవారం హుస్నాబాద్ పట్టణంలో నవంబర్ 30న జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హుస్నాబాద్ ఏసిపి సతీష్, సీఐ ఎర్రల్ల కిరణ్, ఎస్ఐ మహేష్, అక్కన్నపేట ఎస్ఐ వివేక్, కోహెడ ఎస్ఐ తిరుపతి, కేంద్ర బలగాలు ఎస్ఎస్బి (సశాస్త్ర సీమ బాల్ ) అధికారులు సిబ్బంది , పోలీస్ సిబ్బందితో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపి సతీష్ మాట్లాడుతూ ఇన్సిడెంట్ ఫ్రీ ఎన్నికల నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. ఓటర్లు తమ ఓటు హక్కునువినియోగించుకోవాలని సూచించారు. ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడంలో ఓటు యొక్క ప్రాధాన్యత చాలా గొప్పదని, ఓటు హక్కును ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా మీకు నచ్చిన వ్యక్తి కి ఓటు వేసే ప్రశాంతమైన వాతావరణం కల్పిస్తామని తెలిపారు. ఓటు విషయంలో ఎవరైనా బెదిరింపులకు పాలుపడితే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని, లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ 8712667100 లేద డయల్ 100 కాల్ చేయాలని చేసి సూచించారు. మద్యానికి, డబ్బులకు మరే ఇతర వస్తువులకు బానిసలు కావద్దని, మీకు నచ్చిన మెచ్చిన అభ్యర్థికి నిజాయితీగా, నిష్పక్షపాతంగా ,నిర్భయంగా ఓటు వేసి ఓటింగ్ శాతాన్ని పెంచాలని సూచించారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిపించడానికి అన్ని రకాల ప్రణాళికలు తయారు చేయడం జరిగిందన్నారు. పోలింగ్ జరిగే రోజు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు సమకూర్చడం జరుగుతుందన్నారు. గ్రామాలలో ఏ పార్టీ వారు వచ్చి ప్రచారం చేసిన అడ్డుకోవద్దని ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా ప్రచారం చేసుకోవచ్చని మీకు నచ్చిన మెచ్చిన వ్యక్తికి ఓటు వేయండి కానీ ప్రచారాన్ని మాత్రం అడ్డుకోవద్దని అడ్డుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. క్రిటికల్ పోలింగ్ స్టేషన్లలో పారామిలటరీ దళాలతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రవర్తన నియమావళి కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు.