రెండో విడత 26,376 మంది రైతులకు రుణమాఫీ..

Second installment loan waiver for 26,376 farmers.– హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు.
– చెక్కు పంపిణీ చేస్తున్న జిల్లా అదనపు కలెక్టర్ రెవిన్యూ బిఎస్ లతా.
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
జిల్లాలో రెండో విడత 26,376 మంది రైతు కుటుంబాలకు 250.07 కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగినట్లు జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత తెలిపారు.మంగళవారం హైదరాబాద్ సచివాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ, పౌర సంబంధాల శాఖ మంత్రి పి శ్రీనివాస్ రెడ్డి ,రాష్ట్ర మంత్రులు, సిఎస్ శాంతకుమారి తదితరులతో కలిసి రైతులకు రెండో విడత లక్షన్నర రూపాయల రుణమాఫీ కార్యక్రమాలు నిర్వహించారు.అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడత 56,217 మంది రైతు కుటుంబాలకు 282.78 కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగినట్లు తెలిపారు.ప్రభుత్వం ప్రకటించిన రెండో విడత రుణమాఫీలో 26,376 మంది రైతు కుటుంబాలకు 250.07  కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగిందని ఆమె పేర్కొన్నారు. ఈ రుణమాఫీ సంబంధిత శాఖల అధికారులు రైతు భాగస్వాములై విజయవంతం చేశారు. ఈవినింగ్ వరకు రైతుల ఖాతాలలో రుణమాఫీ జమ అవుతాయని  పేర్కొన్నారు. మొదటి, రెండో విడతలో ఏదైనా సాంకేతిక కారణాలవల్ల రుణమాఫీ జరగని రైతులు మండల, డివిజన్ వ్యవసాయ అధికారులను సంప్రదించాలని ఆమె సూచించారు.కొంతమంది రైతుల యొక్క ఆధార్ కార్డు నెంబరు ఆను సందానమైన ఫోన్ నెంబరు తప్పుగా ఉండటం వల్ల రుణ మాఫీ నిధులు జమ కావడం లేదని, అట్టివారు ఎఈఓ ని కలిసిన చో వారి యొక్క సమస్యను పరిష్కరిస్తారని తెలిపారు.వ్యవసాయ అధికారులు రైతులను తప్పకుండా వారి సమస్యను వెంటనే పరిష్కరించి పంపాలని, ప్రభుత్వం అందిస్తున్న రుణమాఫీ అందరికీ అందేలా చూడాలని వారిని ఆదేశించారు. రైతు అంటే మన ఇంట్లో మనిషిగా భావించి అందరికీ రుణమాఫీ జరిగేలా చూడాలన్నారు.డివిజన్ స్థాయిలో గాని మండలాల్లో గాని ఎలాంటి పొరపాట్లు జరిగిన వెంటనే జిల్లా అధికారుల దృష్టికి తీసుకొని రావాలని ఆమె పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని రైతువేదికలలో రైతు రుణమాఫీ కార్యక్రమం జరుగుతుందని రైతులు అందరూ పాల్గొని విజయవంతం చేశారని ఆమె తెలిపారు. అనంతరం జిల్లా రైతు రుణమాఫీ చెక్కును రైతుల చేతుల మీదుగా రిలీజ్ చేశారు.ఈ కార్యక్రమంలో తిరుమలగిరి మున్సిపల్ చైర్ పర్సన్ చాగంటి అనసూయ,ఆర్డిఓ వేణుమాధవ్ రావు, వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, ఎల్ డి ఎం బాపూజీ, డిసిఒ పద్మజ, వివిధ బ్యాంకు మేనేజర్లు సహకార సంఘాలు రైతులతో కలిసి పాల్గొన్నారు.