భువనగిరి పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని భువనగిరి, ఆలేరు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన ఈవిఎం యంత్రాల రెండవ ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు హనుమంత్ కే.జెండగే తెలిపారు. ఆదివారం కలెక్టరేటు కార్యాలయంలోని ఈవిఎం యంత్రాల గోదాములో ఈవిఎం యంత్రాల రెండవ ర్యాండమైజేషన్ కార్యక్రమం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నిర్వహించారు. భువనగిరి అసెంబ్లీ సెగ్మెంటుకు 25 శాతం అదనంగా కలిపి 321 బ్యాలెట్ యూనిట్లు, 321 కంట్రోల్ యూనిట్లు, 40 శాతం అదనంగా కలిపి 359 వివిప్యాట్ లు కేటాయించారు. భువనగిరి జిల్లా కేంద్రంలోని ఆరోరా ఇంజనీరింగ్ కాలేజీలో ఈవిఎం యంత్రాలను భద్రపరస్తామన్నారు. ఆలేరు అసెంబ్లీ సెగ్మెంటుకు సంబంధించి 25 శాతం అదనంగా కలిపి 386 బ్యాలెట్ యూనిట్లు, 386 కంట్రోల్ యూనిట్లు, 40 శాతం అదనంగా కలిపి 432 వివిప్యాట్ లు కేటాయించడం జరిగింది. ఆలేరు లోని ఇండోర్ స్టేడియంలో భద్రపరుస్తామన్నరు. రెం డవ ర్యాండమైజేషన్ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టరు పి.బెన్ షాలోమ్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు, ఆలేరు సహాయ రిటర్నింగ్ అధికారి కె.గంగాధర్, భువగిరి డివిజనల్ అధికారి, భువనగిరి సహాయ రిటర్నింగ్ అధికారి అమరేందర్, బిఎస్పి పార్టీ నుండి బట్టు రామచంద్రయ్య, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుండి సోమ రవీందర్ రెడ్డి, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ నాగేశ్వరాచారి, తహశీలుదార్లు దేశ్యా, శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ తహశీలుదారు సురేష్, సిబ్బంది పాల్గొన్నారు.