
సెల్ ఫోన్ పోగొట్టుకుంటే ఇక నుంచి బాధపడాల్సిన అవసరం లేదని ఎస్ఐ వీర బాబు అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. గత 40 రోజుల క్రితం మండలం లోని చలకుర్తి గ్రామానికి చెందిన పెరిక సైదులు మండల పరిధిలో ని లింగంపల్లి గ్రామ సమీపంలో తన ఒప్పో సెల్ ఫోన్ ను పోగొట్టుకున్నారు.అప్పట్లో స్థానిక పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. పోలీస్ సిబ్బంది సీఈఐఆర్ ద్వారా వెతికి ఒప్పో ఫోన్ ను ట్రే చేసి బాధితునికి మంగళవారం అప్పగించారు. ఈసందర్బంగా ఎస్ఐ వీరబాబు మాట్లాడుతు ఇటీవల పోలీస్ శాఖ నూతనంగా ప్రవేశపెట్టిన సీఈఐఆర్ పోర్టల్ ద్వారా వారు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్స్ ను గుర్తించడం జరిగిందని తెలిపారు. గుర్తించిన ఫోన్స్ ను రికవరీ చేసి బాధితులకు అందించడం జరిగిందని వెల్లడించారు. ప్రస్తుతం సెల్ ఫోన్ లేనిది ఎటువంటి కార్యకలాపాలు ముందుకు సాగడం లేదని, ప్రధానంగా ఆండ్రాయిడ్ ఫోన్స్ వినియోగం ఎక్కువ గా పెరిగిందని అన్నారు.ఇలాంటి క్రమంలో ఫోన్స్ పోతే చాలా మంది ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఎవరివైనా ఫోన్స్ పోయినట్లు అయితే కొనుగోలు చేసిన ఆధారాలతో పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేస్తే పైసా ఖర్చు లేకుండా మీ ఫోన్స్ ను ట్రాకింగ్ చేసి అవి ఎక్కడ ఉన్నాయో గుర్తించడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు పోలీస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.